Postal Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో పోస్టల్‌ ఉద్యోగాలు.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి..

| Edited By: Ravi Kiran

Oct 27, 2021 | 6:20 AM

Postal Recruitment: భారత ప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ పోస్టల్‌ సర్కిల్‌లో ఉన్న ఖాళీలను స్పోర్ట్స్‌ కోటాలో ..

Postal Recruitment: స్పోర్ట్స్‌ కోటాలో పోస్టల్‌ ఉద్యోగాలు.. అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలి..
India Post Jobs
Follow us on

Postal Recruitment: భారత ప్రభుత్వ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేరళ పోస్టల్‌ సర్కిల్‌లో ఉన్న ఖాళీలను స్పోర్ట్స్‌ కోటాలో  భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 95 ఖాళీలను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 95 ఖాళీలకు గాను పోస్టల్‌ అసిస్టెంట్‌ (16), సార్టింగ్‌ అసిస్టెంట్‌ (13), పోస్ట్‌ మ్యాన్‌ (28), మెయిల్‌ గార్డ్‌ (01), మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ (37) ఉన్నాయి.

* ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌, బాడీ బిల్డింగ్‌, చెస్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, షూటింగ్‌ క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ (10+2) ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు జాతీయ/ అంతర్జాతీయ/ ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

* పోస్టల్‌ అసిస్టెంట్‌/ సార్టింగ్‌ అసిస్టెంట్‌ / పోస్ట్‌ మ్యాన్‌ / మెయిల్‌ గార్డ్‌ పోస్టులకి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు 25 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు తమ వివరాలను ది అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (రిక్రూట్‌మెంట్‌), ఆఫీస్‌ ఆఫ్‌ ది చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌, కేరళ సర్కిల్‌, తిరువనంతపురం – 695033 అడ్రస్‌కి పంపించారు.

* అభ్యర్థులను విద్యార్హతలు, క్రీడార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: ఈ వీడియో చూస్తే మీ పెంపుడు కుక్కతో అస్సలు జోక్ చేయరు.. ఎందుకో తెలుసా..

Facebook: ఫేస్‌బుక్‌ ఫేక్‌న్యూస్‌గా మారింది.. బీజేపీకి అమ్ముడు పోయింది.. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు

Facebook: ఫేస్‌బుక్‌ ఫేక్‌న్యూస్‌గా మారింది.. బీజేపీకి అమ్ముడు పోయింది.. కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు