
అమరావతి, సెప్టెంబర్ 15: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. మంగళవారం (సెప్టెంబర్ 15) ఉదయం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 163 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6, 2026 నుంచి మొదలవనుంది. అక్టోబర్ 27, 2026వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ప్రిలిమ్స్లో రెండు పేపర్లు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అంటే ఆఫ్లైన్ (పెన్ను, పేపర్) విధానంలో పరీక్ష ఉంటుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అలాగే మరో 20 శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి ఈ నెల 24న ప్రత్యేకంగా మరో ప్రకటన వెలువడనుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లకు ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతాయి. 5 శాఖలకు సంబంధించి పోస్టులకు బుధవారం (సెప్టెంబర్ 16) నోటిఫికేషన్ వెలువడనుంది. 10 శాఖలకు సంబంధించి పోస్టులకు సెప్టెంబర్ 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్ను సందర్శించి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని కమిషన్ సూచించింది.