Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1 Mains 2025: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి!

గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన జారీ చేసింది. మరోమారు ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష రాసే మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులకు ఏపీపీఎస్సీ మరోసారి అవకాశం..

APPSC Group 1 Mains 2025: ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్ధులకు మరో ఛాన్స్.. మిస్‌ చేసుకోకండి!
APPSC Group 1 Mains
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 23, 2025 | 6:37 AM

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక ప్రకటన జారీ చేసింది. మరోమారు ఐచ్ఛికాల మార్పుకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు పరీక్ష రాసే మాధ్యమం, పోస్టులు, జోనల్‌ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల మార్పులు చేర్పులకు ఏపీపీఎస్సీ మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 2 వరకు అధికారిక వెబ్‌సైట్‌లో సరిచేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు గ్రూప్‌ 1 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

రాష్ట్రంలో గ్రూప్‌ 1 సర్వీసు 2023 పోస్టుల భర్తీకి మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ మే 03 నుంచి 09 తేదీ వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. గ్రూప్‌ 1 మెయిన్స్‌ మొత్తం 7 పేపర్లకు నిర్వహించనున్నారు. ఏ పరీక్ష ఏతేదీన నిర్వహిస్తారో ఆ వివరాలు ఈ కింది షెడ్యూల్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • మే 3వ తేదీన తెలుగు పేపర్‌ (అర్హత పరీక్ష) పరీక్ష జరుగుతుంది
  • మే 4వ తేదీన ఇంగ్లిష్‌ పేపర్‌ (అర్హత పరీక్ష) పరీక్ష జరుగుతుంది
  • మే 5వ తేదీన పేపర్‌–1.. జనరల్‌ ఎస్సే పరీక్ష జరుగుతుంది
  • మే 6వ తేదీన పేపర్‌–2.. భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలపై పరీక్ష జరుగుతుంది
  • మే 7వ తేదీన పేపర్‌–3.. పాలిటీ,భారత రాజ్యాంగం, పాలన, లా అండ్‌ ఎథిక్స్‌ అంశాలపై పరీక్ష జరుగుతుంది
  • మే 8వ తేదీన పేపర్‌–4.. భారత, ఆంధ్రప్రదేశ్‌ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి అంశాలపై పరీక్ష జరుగుతుంది
  • మే 9వ తేదీన పేపర్‌–5.. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ అంశాలపై పరీక్ష జరుగుతుంది

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ డీఈఈసీఈటీ-2025 నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి దరఖాస్తులు ప్రారంభం

తెలంగాణ డీఎడ్ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌), డీపీఎస్ఈ (డిప్లొమా ఇన్‌ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీ డీఈఈసీఈటీ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. 2025-2027 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వ స్కూల్ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్ ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2025 మార్చి 24 నుంచి 2025 మే 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.