
అమరావతి, మే 7: ఈ ఏడాది పాలీసెట్ మొత్తం ఫలితాల్లో అత్యధికంగా బాలికలు 93.57 శాతం ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిలు 89.88 కనీస అర్హత మార్కులు పొందారు. అయితే పాలీసెట్లో 16 మంది విద్యార్ధులకు 120కి 120 మార్కులకు వచ్చాయి. మార్కులు సమానంగా వచ్చిన వీరిందరికీ పుట్టినతేదీ ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. వీరిలో తొమ్మిది మంది పశ్చిమగోదారి జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. విశాఖపట్నం నుంచి ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కాకినాడ, తిరుపతి జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 265 పాలిటెక్నిక్ కాలేజీల్లో 84 వేలకుపైగా సీట్లు ఉన్నాయి. పాలీసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తామని ఉన్నతవిద్య కమిషనర్ భరత్గుప్తా తెలిపారు. పాలిసెట్ ఫలితాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 99.11 శాతంతో మొదటిస్థానంలో నిలవగా.. శ్రీసత్యసాయి జిల్లా 87.85 శాతం ఉత్తీర్ణతతో అట్టడుగున నిలిచింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.