Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంజినీరింగ్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచే..

ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయింది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇదిలా ఉంటే.. సాధారణంగా ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు అడ్మిషన్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ను చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది...

Andhra Pradesh: ఇంజినీరింగ్ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచే..
Representative Image
Follow us
pullarao.mandapaka

| Edited By: Narender Vaitla

Updated on: Nov 05, 2023 | 7:18 AM

ఇంజనీరింగ్ ప్రత్యేక దశ అడ్మిషన్ల ప్రక్రియకు సాంకేతిక విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ ఆరో తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి నోటిఫికేషన్‌లో ప్రకటించారు. ఉన్నత విద్యామండలి జారీ చేసిన జీవో నెం.179ను అనుసరించి ఏపీఈఈసెట్-2023 లో అర్హత సాధించిన అభ్యర్థులు కోసం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మొదటి విడత, రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయింది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. ఇదిలా ఉంటే.. సాధారణంగా ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు ముగిసిన తర్వాత కన్వీనర్ కోటా సీట్లకు అడ్మిషన్లు నిర్వహించడం గతంలో ఎప్పుడూ లేదు. అందుకే ఈ సంవత్సరాలనికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ను చేపడుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొదటి, రెండో దశ కౌన్సిలింగ్, స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశం పొందలేని విద్యార్ధులు ఈ ప్రత్యేక దశ కౌన్సిలింగ్‌కు అర్హత ఉంది. అయితే ఇప్పటికే ప్రవేశాల కోసం రిజిస్టేషన్ చేసుకున్న వారిని మాత్రమే ఈ ప్రత్యేక దశలో అప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదు. విద్యార్ధుల నుంచి వచ్చిన అభ్యర్థనతో స్పెషల్ ఫేస్ కౌన్సిలింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ప్రత్యేక దశ అడ్మిషన్లకు ప్రభుత్వ పథకాల వర్తింపు..

ప్రత్యేక దశ లో చేసిన ప్రవేశాలకు కూడా కన్వీనర్ కోటాతో సమానంగా ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు అనుమతి ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలలోని బీఈ, బీటెక్ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి, నిబంధనల మేరకు అడ్మిషన్లు చేయనున్నారు. ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయగా, నవంబరు 6, 7 తేదీలలో రెండు రోజుల పాటు వెబ్ ఆప్షన్ ల నమోదుకు అవకాశం ఇచ్చారు. నవంబరు 8వ తేదీ ఆప్షన్ల మార్పునకు అనుమతి ఉంటుంది. నవంబరు 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు కేటాయించిన కళాశాలలో నవంబరు 11 నుంచి 13 వరకు విద్యార్ధులు వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
గ్రౌండ్‌లో ప్రేయసి.. హాఫ్ సెంచరీతో చెలరేగిన ప్రియుడు.. కట్‌చేస్తే
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
పెట్టుబడులే లక్ష్యంగా దూసుకెళ్తోన్న తెలంగాణ సర్కార్!
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
తలనొప్పి ఎందుకు వస్తుంది..? ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డేంజర్ అంట
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
కంచ గచ్చిబౌలి భూవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
IPL 2025: ప్లేఆఫ్స్ నుంచి చెన్నై ఔట్.. షాకిస్తోన్న సమీకరణాలు?
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
స్టార్ హీరోయిన్ సమంత రిజక్ట్ చేసిన సినిమాలు ఇవే!
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
ఓవర్ త్రోతో పాక్ ఓపెనర్ దవడ ఫ్రాక్చర్‌! గాయంతో కుప్పకూలిన ప్లేయర్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
బిగ్‌బాస్‌లోకి 'అలేఖ్య చిట్టి పికిల్స్' సిస్టర్స్‌! వీడియో వైరల్
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
ప్రాణాల మీదకు వచ్చిన రీల్ షూట్..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. 97 మంది మావోయిస్టుల లొంగుబాటు..