AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP SET 2025 Exam Date: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలివే

రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లుగా ఉద్యోగాలకు పొందడానికి అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీ సెట్‌) 2025 నోటిఫికేషన్‌ను తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఏపీ సెట్‌ నిర్వహణ..

AP SET 2025 Exam Date: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలివే
AP SET 2025 Exam Date
Srilakshmi C
|

Updated on: Jan 11, 2026 | 6:58 AM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లుగా ఉద్యోగాలకు పొందడానికి అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీ సెట్‌) 2025 నోటిఫికేషన్‌ను తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఏపీ సెట్‌ నిర్వహణ బాధ్యతలు ఏయూ నిర్వహిస్తుంది. మొత్తం 30 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీ సెట్‌) 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కనీసం 55 శాతం మార్కులతో సంబంధి సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. అంటే ఎవరైనా ఈ పరక్ష రాయవచ్చన్నమాట. జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్ 1) పరీక్ష అందరికీ కామన్‌గా ఉంటుంది. పేపర్‌ 2 పరీక్ష.. ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.. ఈ సబ్జెక్టుల్లో జరుగుతుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 9, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఇక రాత పరీక్ష మార్చి 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. కనీస అర్హత మార్కులు సాధించిన వారికి సెట్‌ లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీ ఉంటుంది. అయితే దరఖాస్తు సమయంలో పరీక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు రూ.1600, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.1300, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు రూ.900 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాత పరీక్ష విధానం

ఏపీ సెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది.పేపర్‌ 1 పరీక్ష టీచింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో మొత్తం 50 ప్రశ్నలకు 100 మార్కులకు ఉంటుంది. పేపర్‌ 2 పరీక్ష సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌లో 100 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటుంది. అంటే మొత్తం మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుందన్నమాట. పేపర్ 1 పరీక్షలో అర్హత మార్కులు వచ్చిన వారికే పేపర్‌ 2 పరీక్ష సమాధాన పత్రం చెల్లుబాటు అవుతుంది. మొత్తం మూడు గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది.

నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.