World Best Whiskey: ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీ యజమాని ఎవరు? రూ.70,000 కోట్ల సంపద

|

Jul 03, 2024 | 5:27 PM

భారతదేశంలో తయారైన విస్కీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ అనే బిరుదును పొందింది. అమృత్ డిస్టిలరీస్‌కి 'వరల్డ్స్ బెస్ట్ విస్కీ' బిరుదు లభించింది. లండన్‌లోని 2024 ఇంటర్నేషనల్ స్పిరిట్స్ ఛాలెంజ్‌లో అమృత్ డిస్టిలరీస్ విజయం భారతదేశ స్పిరిట్స్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన క్షణం. ఈ ఛాలెంజ్ 29వ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ విస్కీ బ్రాండ్‌లు ఉన్నాయి...

World Best Whiskey: ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ తయారీ కంపెనీ యజమాని ఎవరు? రూ.70,000 కోట్ల సంపద
World Best Whiskey
Follow us on

భారతదేశంలో తయారైన విస్కీ ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ అనే బిరుదును పొందింది. అమృత్ డిస్టిలరీస్‌కి ‘వరల్డ్స్ బెస్ట్ విస్కీ’ బిరుదు లభించింది. లండన్‌లోని 2024 ఇంటర్నేషనల్ స్పిరిట్స్ ఛాలెంజ్‌లో అమృత్ డిస్టిలరీస్ విజయం భారతదేశ స్పిరిట్స్ పరిశ్రమకు ఒక ముఖ్యమైన క్షణం. ఈ ఛాలెంజ్ 29వ ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ విస్కీ బ్రాండ్‌లు ఉన్నాయి. వీటిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, జపాన్ పేర్లు ప్రముఖంగా వినిపించినా టైటిల్ మాత్రం భారత్‌కే దక్కింది. అటువంటి పరిస్థితిలో ఈ విస్కీ బ్రాండ్ యజమాని, అతని వద్ద ఎంత సంపద ఉందో తెలుసుకుందాం.

విస్కీ భారతదేశంలో, విదేశాలలో ప్రసిద్ధి:

అమృత్ భారతదేశపు మొట్టమొదటి సింగిల్ మాల్ట్ విస్కీ. నేడు దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో జెఎన్ రాధాకృష్ణారావు జగదాలే ఈ బ్రాండ్‌ను ప్రారంభించారు. ఆయన కుమారుడు నీలకంఠ జగదలే దానిని మరింత విస్తరించుకుంటూ ముందుకెళ్లాడు. అమృత్ డిస్టిలరీస్ ప్రారంభంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL)ని తయారు చేసింది. ఇది ఎక్కువగా కర్ణాటక, కేరళలోని క్యాంటీన్ దుకాణాలకు సరఫరా అయ్యేది. ప్రస్తుతం ఉన్న ప్రధాన డిస్టిలరీ 1987లో నిర్మించబడింది. ఇది కంబిపురలో నాలుగు ఎకరాల్లో విస్తరించి ఉంది. 1976లో జెఎన్‌ రావ్‌ జగదాలే మరణించారు. అతని తర్వాత అతని కుమారుడు నీలకంఠరావు జగ్దాలే కంపెనీ బాధ్యతలు చేపట్టారు. ఆ కంపెనీకి సీఎండీ అయ్యాడు. ఆయన నాయకత్వంలో అమృత్ డిస్టిలరీస్ కొత్త పుంతలు తొక్కింది. సంస్థ ఎంతో అభివృద్ధి చెంది పరిశ్రమలో పెద్ద పేరు సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి

తండ్రి మరణానంతరం రక్షిత్ ఎన్. జగదలే ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రక్షిత్ చాలా ముఖ్యమైన మార్పులు చేశాడు. 2022లో అమృత్ ‘సింగిల్ మాల్ట్స్ ఆఫ్ ఇండియా’ అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించబోతున్నట్లు జగ్డేల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అమృత్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి బేస్ స్పిరిట్‌లను కొనుగోలు చేస్తుంది. వాటిని వివిధ మార్గాల్లో పరిపక్వం చేసి విక్రయిస్తుంది. ఈ పరిశోధన మొదటి ఫలితం అమృత్ నీదాల్ పీటెడ్ ఇండియన్ విస్కీ. ఇది భారతదేశంలోని తీర ప్రాంతాల నుండి తీసుకువచ్చిన బేస్ స్పిరిట్ నుండి తయారు చేశారు.

ఒక బాటిల్ ధర ఎంత?

మింట్ లాంజ్ నివేదిక ప్రకారం.. దాని 12,000 సీసాలలో మొత్తం సీసాలు భారతదేశంలో రూ. 5,996కి విక్రయించారు. మీడియా కథనాల ప్రకారం, జగదలే కుటుంబం నికర విలువ రూ.70,000 కోట్లకు పైగా ఉంది. 2004లో ఈ విస్కీని స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ‘అమృత్ సింగిల్ మాల్ట్ విస్కీ’ పేరుతో విడుదల చేశారు. బ్రిటన్‌లో ప్రారంభించిన రెండు సంవత్సరాలలో ఇది స్కాండినేవియా, పశ్చిమ ఐరోపాకు కూడా వ్యాపించింది. ఆగస్ట్ 2009లో అమృత్ సింగిల్ మాల్ట్ విస్కీ ఆస్ట్రేలియాలో ప్రారంభించారు. ఆ తర్వాత 2008లో దక్షిణాఫ్రికాలో ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి