AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PMSBY: రూ.20కే రెండు లక్షల బీమా.. కేంద్రం అందించే ఆ పాలసీ గురించి తెలుసా?

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతుంది. రోడ్డు ప్రమాదం అంటే ఓ వ్యక్తి ప్రమాదానికి గురి కావడం కాదు ఓ కుటుంబం మొత్తం రోడ్డున పడడం అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కుటుంబ పెద్ద ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఆ కుటుంబానికి కొంత భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన అనే కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

PMSBY: రూ.20కే రెండు లక్షల బీమా.. కేంద్రం అందించే ఆ పాలసీ గురించి తెలుసా?
Pradhan Mantri Suraksha Bima
Nikhil
|

Updated on: Jun 27, 2025 | 4:00 PM

Share

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) అనేది భారతదేశంలోని శ్రామిక జనాభాకు సరసమైన ఆర్థిక రక్షణను అందించే లక్ష్యంతో ప్రభుత్వ మద్దతుతో కూడిన ప్రమాద బీమా పథకంగా మారింది. 2015లో ప్రారంభించిన ఈ పథకంలో నమోదులో 443 శాతం వృద్ధి నమోదై, మార్చి 2016లో 9.40 కోట్ల నుంచి ఏప్రిల్ 2025 నాటికి 51.06 కోట్లకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పీఎంఎస్‌బీవై చాలా తక్కువ ఖర్చుతో ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది.  ప్రీమియం సంవత్సరానికి కేవలం రూ. 20గా ఉంది. ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి వైకల్యం సంభవిస్తే రూ. 2 లక్షలు బీమా వస్తుంది. అలాగే పాక్షిక శాశ్వత వైకల్యానికి లక్ష రూపాయలు పొందవచ్చు. అధిక బీమా ప్రీమియంలు చెల్లించలేని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈ పథకం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఈ పథకానికి 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలగే బ్యాంకు లేదా పోస్టాఫీసులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. వారి ఖాతా నుండి ప్రీమియం యొక్క ఆటో-డెబిట్ కోసం సమ్మతిని ఇస్తుంది. ఈ పాలసీ ఏటా పునరుద్ధరిస్తారు. ఖాతాదారుడి లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి ప్రతి సంవత్సరం ప్రీమియం ఆటోమెటిక్‌గా కట్ అవుతుంది. 

భారత పౌరులు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ రెండింటిలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.మీరు పొదుపు ఖాతా కలిగి ఉన్న మీ బ్యాంకు శాఖ లేదా పోస్టాఫీసును సందర్శించాలి. పీఎంఎస్‌బీవై ఫారమ్ కోసం అడగాలి. మీ బ్యాంక్ వెబ్‌సైట్ లేదా www.jansuraksha.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, నామినీ పేరు, సంబంధం, ఖాతా నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను పూరించాలి. రూ. 20 ప్రీమియం ఆటో డెబిట్ కోసం ఫారమ్‌ను అందించాలి. ఖాతాదారులు ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ స్కీమ్‌ను తీసుకోవచ్చు. మీ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి, బీమా లేదా సేవల కింద పీఎంఎస్‌బైవైను ఎంచుకోవాలి. అక్కడ వచ్చే  సూచనలను అనుసరించండి, ఆటో-డెబిట్ సమ్మతిని ఇవ్వాలి. అంతే మీ పథకం యాక్టివ్ అవతుంది. 

పీఎంఎస్‌బీవైను ప్రభుత్వ మరియు ప్రైవేట్ బీమా కంపెనీలు, షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులతో కలిసి అందిస్తున్నాయి. ప్రభుత్వం క్రమం తప్పకుండా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లను పర్యవేక్షిస్తుంది. అలాగే బ్యాంకులు, బీమా సంస్థల సహాయంతో ఫిర్యాదులను పరిష్కరిస్తుంది. పీఎంఎస్‌బీవై అనేది అందరికీ ఆర్థిక, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగమని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న నమోదులు కేవలం అవగాహనతో సాధ్యమైందని వివరిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి