UPI: ఆగస్ట్‌లో రికార్డ్‌ స్థాయిలో యూపీఐ లావాదేవీలు.. రోజుకు సగటున రూ. 90 వేల కోట్లు!

UPI Transactions: ఈ స్థిరమైన వృద్ధి దేశవ్యాప్తంగా చెల్లింపుల కోసం UPIపై ఆధారపడటం పెరుగుతున్నట్లు నివేదిక హైలైట్ చేసింది. యూపీఐ లావాదేవీలు విలువ, వాల్యూమ్‌లలో గణనీయంగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. పెరుగుతున్న ధోరణి వాల్యూమ్‌లలో కూడా సమానంగా కనిపిస్తుంది. అదే కాలంలో..

UPI: ఆగస్ట్‌లో రికార్డ్‌ స్థాయిలో యూపీఐ లావాదేవీలు.. రోజుకు సగటున రూ. 90 వేల కోట్లు!

Updated on: Aug 19, 2025 | 12:09 PM

UPI Transactions: యుపిఐ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థలలో యుపిఐ ప్రపంచంలోనే నంబర్ వన్. ఆగస్టు నెలలో ఒక రోజులో సగటున రూ.90,446 కోట్ల విలువైన యుపిఐ లావాదేవీలు జరిగాయని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. జనవరిలో సగటు రోజువారీ యుపిఐ లావాదేవీ రూ.75,743 కోట్లు. జూలైలో ఇది రూ.80,919 కోట్లకు పెరిగింది. ఇప్పుడు, ఆగస్టులో ఇది రూ.90,000 కోట్ల మార్కును దాటడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Electric Scooter: అన్నింటిని వెనక్కి నెట్టి నంబర్‌ 1గా నిలిచిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

లావాదేవీల విలువలోనే కాకుండా, సంఖ్య పరంగా కూడా యూపీఐ వాడకం భారీగా పెరిగింది. జనవరితో పోలిస్తే ఆగస్టు నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్య 127 మిలియన్లు పెరిగి, మొత్తం 675 మిలియన్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. చిన్న మొత్తాల బదిలీల నుంచి పెద్ద మొత్తాల చెల్లింపుల వరకు అన్ని రకాల అవసరాలకు భారతీయులు యూపీఐపై ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇది స్పష్టం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: iPhone 15: ఆపిల్‌ ప్రియులకు కళ్లు చెదిరే ఆఫర్‌.. కేవలం రూ.32 వేలకే ఐఫోన్‌ 15

ఈ స్థిరమైన వృద్ధి దేశవ్యాప్తంగా చెల్లింపుల కోసం UPIపై ఆధారపడటం పెరుగుతున్నట్లు నివేదిక హైలైట్ చేసింది. యూపీఐ లావాదేవీలు విలువ, వాల్యూమ్‌లలో గణనీయంగా పెరిగినట్లు నివేదిక పేర్కొంది. పెరుగుతున్న ధోరణి వాల్యూమ్‌లలో కూడా సమానంగా కనిపిస్తుంది. అదే కాలంలో సగటు రోజువారీ లావాదేవీ వాల్యూమ్‌లు 127 మిలియన్లు పెరిగి, జనవరితో పోలిస్తే ఆగస్టులో 675 మిలియన్లకు చేరుకున్నాయి.

ఇది కూడా చదవండి: Jio Plan: జియో వినియోగదారులకు షాక్‌.. రోజు 1జీబీ డేటా, కాలింగ్ ప్లాన్‌ నిలిపివేత!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల నుండి 520 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంటే ఈ ఖాతాల నుండి యూపీఐ ద్వారా లావాదేవీలు జరిగాయి. యెస్ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ ద్వారా అత్యధిక డబ్బు వచ్చింది. 800 కోట్ల లావాదేవీలలో యెస్ బ్యాంక్ ఖాతాలలో ద్వారా జరిగింది. ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువగా చెల్లింపుదారులు అయితే, ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా చెల్లింపులను స్వీకరించేవని గమనించాలి.

యూపీఐ వినియోగంలో కర్ణాటక 2వ స్థానం:

యూపీఐ వినియోగం అత్యధికంగా ఉన్న టాప్-3 రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి. మొత్తం యూపీఐ వినియోగంలో మహారాష్ట్ర వాటా 9.8 శాతం. ఇది జూలై నెలకు సంబంధించిన సంఖ్య. కర్ణాటక వాటా 5.5 శాతం కాగా, ఉత్తరప్రదేశ్ వాటా 5.3 శాతం.

ఇది కూడా చదవండి: Jio Plan: జియోలో రూ.189 చౌకైన ప్లాన్‌.. డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, వ్యాలిడిటీ ఎంతో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us