AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!

Crypto Currencies: మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తరువాత డిజిటల్ ఎసెట్స్(Digital assets), క్రిప్టో కాయిన్స్ పెట్టుబడులు దేశంలో భారీగా పెరిగాయి.

Crypto Currencies: క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..!
Crypto Currencies
Ayyappa Mamidi
|

Updated on: Apr 28, 2022 | 8:30 PM

Share

Crypto Currencies: మన దేశంలో క్రిప్టో కరెన్సీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా తరువాత డిజిటల్ ఎసెట్స్(Digital assets), క్రిప్టో కాయిన్స్, స్టాక్ మార్కెట్ల(Stock Markets) వంటి వాటిలో ఎక్కువ మంది రిటైలర్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ తరుణంలో బడ్జెట్ సమయంలో క్రిప్టో ఆదాయాలపై ఏకంగా 30 శాతం పన్నుతో పాటు, చెల్లింపుల్లో టీడీఎస్ కూడా వసూలు చేస్తామని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో.. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయం తీసుకుంటుందంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ డిజిటల్ కరెన్సీలపై తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని.. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి మరింత సమయం పడుతుందని నిర్మల అభిప్రాయపడ్డారు.

క్రిప్టో డిజిటల్ ఆస్తులకు సంబంధించి అన్ని విషయాలను తప్పక పరిగణలోకి తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. ఆ తరువాతే క్రిప్టో రెగ్యులేషన్స్ పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను మనీ లాండరింగ్ నుంచి ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే వరకూ అనేకమైన మార్గాల్లో దుర్వినియోగం చేస్తున్నారని ఆర్థిక మంత్రి అన్నారు. అంతేకాక అన్ని దేశాలు కలిసి కట్టుగా ఈ కరెన్సీలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇవి దేశాల ఆర్థిక స్థిరత్వానికి అత్యంత ప్రమాదకరమని గతంలోనే అన్నారు. ఈ విషయంలో కేవలం భారత్ మాత్రమే కాకుండా.. అనేక ఇతర దేశాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ ప్రమాదం నుంచి భయటపడాలని.. అందుకు ముందుగా ఆందోళలను పరిష్కరించాలని అన్నారు.

క్రిప్టో కరెన్సీలకు చెక్ పెట్టేందుకు రిజర్వు బ్యాంక్ సొంతంగా డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలోనే పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ డిజిటల్ రూపీని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇవీ చదవండి..

Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..

Elon Musk: ఎలాన్ మస్క్ విచిత్ర ప్రవర్తనకు ఒక వ్యాధి కారణమని తెలుసా.. ఇంతకీ దాని లక్షణాలేంటంటే..

Follow Us
గుడి గంట శబ్దం వల్ల నిజంగా ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన నిజం
గుడి గంట శబ్దం వల్ల నిజంగా ఏమవుతుంది? శాస్త్రం చెప్పిన నిజం
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది ఈ జిల్లాలోనే!
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
రూ.లక్ష చెక్ బౌన్స్ వివాదం.. కోర్టులో టీమిండియా బౌలర్‎కు ఊరట
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
వెండి గొలుసు మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఈ 5 కారణాలు చూసేయండి!
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
కిచెన్ స్విచ్ బోర్డులపై మొండి జిడ్డు మురికిగా మారిందా? ఈ సింపుల్
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం: ప్రధాని మోదీ
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
చేతబడితో ఊరిలో వరుస మరణాలు.. OTTలో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళ ఎస్సై
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
Video: దిగ్గజాన్నే 'ఫ్యాన్ బాయ్'గా మార్చేసిన 15 ఏళ్ల బుడ్డోడు..!
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి
కేవలం నీళ్లు తాగితే సరిపోదు.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వండి