AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension Scheme: పండగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇప్పుడు పూర్తి పెన్షన్‌.. వివరాలివే!

Pension Scheme: రిజిస్ట్రేషన్ లేదా కాంట్రిబ్యూషన్ క్రెడిట్ ఆలస్యం అయితే ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తుంది. అలాగే UPS కింద అర్హత ఉన్న ఉద్యోగులు ఒకేసారి NPSకి మారవచ్చని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది..

Pension Scheme: పండగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఇప్పుడు పూర్తి పెన్షన్‌.. వివరాలివే!
Subhash Goud
|

Updated on: Sep 05, 2025 | 1:22 PM

Share

Pension Scheme: దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు ఒక పెద్ద బహుమతిని ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, పెన్షన్ల మంత్రిత్వ శాఖ ఏకీకృత పెన్షన్ పథకానికి సంబంధించిన నియమాలను నోటిఫై చేసింది. ఈ నియమాలు పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించినవి. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు UPS కింద 20 సంవత్సరాల సేవ తర్వాత కూడా పూర్తి పెన్షన్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ITR Filing 2025: మీరు ఈ తప్పు చేస్తే రీఫండ్‌ రావడానికి 9 నెలలు పట్టవచ్చు!

కొత్త పథకం కింద ఉద్యోగులు కేవలం 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కూడా పదవీ విరమణ ప్రయోజనాన్ని పొందుతారు. వారికి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. ఇంతకుముందు ఈ పరిమితి 25 సంవత్సరాలు. దీనిని తగ్గించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప బహుమతిని ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధర రూ.1,25,000లకు పెరగనుందా? ఆందోళన రేపుతున్న బ్యాంకు రిపోర్ట్‌!

ఈ సౌకర్యాలు అందుబాటులో..

దీనితో పాటు UPS ఎంచుకునే ఉద్యోగులు పెన్షన్ కాకుండా అనేక ఇతర సౌకర్యాలను పొందుతారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు వైకల్యానికి గురైతే లేదా ఏదైనా కారణం వల్ల మరణిస్తే, వైకల్యం సంభవించినప్పుడు ఉద్యోగి, అతని కుటుంబం CCS పెన్షన్ నియమాలు లేదా UPS నిబంధనల ప్రకారం ఎంపికను ఎంచుకునే హక్కును కలిగి ఉంటారు. ఇది కుటుంబానికి సురక్షితమైన పెన్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది.

ఇది కూడా చదవండి: Viral Video: కొడుకు అమ్మయిలతో స్టేజీపై డ్యాన్స్‌.. అంతలో తల్లి ఏం చేసిందో చూస్తే నవ్వుకుంటారు

యుపిఎస్ పథకం:

జాతీయ పెన్షన్ పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 ఏప్రిల్ 1న అమలు చేసింది. ఉద్యోగి, ప్రభుత్వం ఇద్దరూ ఈ పథకానికి సహకరిస్తారు. రిజిస్ట్రేషన్ లేదా కాంట్రిబ్యూషన్ క్రెడిట్ ఆలస్యం అయితే ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పరిహారం చెల్లిస్తుంది. అలాగే UPS కింద అర్హత ఉన్న ఉద్యోగులు ఒకేసారి NPSకి మారవచ్చని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు తమ పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా VRS తీసుకోవడానికి మూడు నెలల ముందు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.

అయితే క్రమశిక్షణా చర్యలు లేదా అలాంటి దర్యాప్తు కారణంగా తమ పదవుల నుండి తొలగించిన ఉద్యోగులపై కూడా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రస్తావించారు. అటువంటి పరిస్థితిలో ఆ ఉద్యోగులు UPSని NPSకి మార్చలేరు. దీని కోసం 2025 సెప్టెంబర్ 30 తేదీని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: Gold Price: బంగారం ధర రూ.1,25,000లకు పెరగనుందా? ఆందోళన రేపుతున్న బ్యాంకు రిపోర్ట్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి