భారతదేశంలోని ఏడు అత్యంత సంపన్న రాష్ట్రాలు ఏవో తెలుసా.? అందులో ఏపీ, తెలంగాణ స్థానం..!

|

Apr 11, 2024 | 10:13 AM

భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. ఇక్కడ చాలా రాష్ట్రాల్లో ఎక్కువ మంది ధనవంతులు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది పేద ప్రజలు కూడా నివిసిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఏడు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాల జాబితాలో చేర్చబడినవి కూడా ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక ధనిక రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన ఆ 7 రాష్ట్రాలు ఏవి..?

భారతదేశంలోని ఏడు అత్యంత సంపన్న రాష్ట్రాలు ఏవో తెలుసా.? అందులో ఏపీ, తెలంగాణ స్థానం..!
Richest States Of India
Follow us on

భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. ఇక్కడ చాలా రాష్ట్రాల్లో ఎక్కువ మంది ధనవంతులు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది పేద ప్రజలు కూడా నివిసిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఏడు రాష్ట్రాలు ధనిక రాష్ట్రాల జాబితాలో చేర్చబడినవి కూడా ఉన్నాయి. భారతదేశంలో అత్యధిక ధనిక రాష్ట్రాలుగా గుర్తింపు పొందిన ఆ 7 రాష్ట్రాలు ఏవి..? వాటి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

దేశంలోని ఏడు ధనిక రాష్ట్రాల జాబితా ఇలా ఉంది..

01. మహారాష్ట్ర..

ఇవి కూడా చదవండి

భారతదేశంలోని అత్యంత ధనిక రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రం జిడిపి రూ.38.79 లక్షల కోట్లు. దీని రాజధాని ముంబైని దేశ ఆర్థిక రాజధాని అని కూడా అంటారు.

02. తమిళనాడు..

తమిళనాడు భారతదేశంలో రెండవ ధనిక రాష్ట్రం. తమిళనాడు జీడీపీ రూ.28.03లక్షల కోట్లు. ఇక్కడి జనాభాలో 50శాతానికి పైగా నగరాల్లోనే నివసిస్తున్నారు.

3. గుజరాత్

గుజరాత్‌ జీడీపీ రూ.26.62 లక్షల కోట్లు. ఇది పొగాకు, కాటన్ క్లాత్, బాదంపప్పుల ప్రధాన ఉత్పత్తిదారు. దేశంలో తయారయ్యే మొత్తం మందులలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయి.

04. కర్ణాటక

భారతదేశంలోని ధనిక రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా చేరింది. 25 లక్షల కోట్ల జిడిపితో కర్ణాటక నాలుగో స్థానంలో నిలిచింది.

05. ఉత్తర ప్రదేశ్

ఉత్తరప్రదేశ్ జీడీపీ రూ.24.39 లక్షల కోట్లు. నోయిడా, ఘజియాబాద్ వంటి రాష్ట్రంలోని అనేక నగరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. అనేక కంపెనీలు ఇక్కడ తమ శాఖలను ప్రారంభించాయి.

06. పశ్చిమ బెంగాల్‌..

పశ్చిమ బెంగాల్ జీడీపీ రూ.17.19 లక్షల కోట్లు. దీని ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం. మధ్యతరహా పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది.

07. రాజస్థాన్‌..

ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం, మైనింగ్, పర్యాటక రంగాలపై ఆధారపడి ఉంటుంది. బంగారం, వెండి, ఇసుకరాయి, పాలరాయి, రాక్ ఫాస్ఫేట్, సున్నపురాయి, రాగి మరియు లిగ్నైట్ నిల్వలు ఉన్నాయి. దీని జీడీపీ రూ.15.7 కోట్లు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..