AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market Updates: మండే మంట.. ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు.. ఈ షేర్లు మాత్రం లాభాల్లో..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 56,757 స్థాయి వద్ద 440 పాయింట్ల పతనంతో ప్రారంభమైంది. అమ్మకాలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాయి. ఐదు నిమిషాల్లోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయింది.

Share Market Updates: మండే మంట.. ఆరంభంలోనే కుప్పకూలిన మార్కెట్లు.. ఈ షేర్లు మాత్రం లాభాల్లో..
Stock Market
Sanjay Kasula
|

Updated on: Apr 25, 2022 | 9:46 AM

Share

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో మొదలయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 56,757 స్థాయి వద్ద 440 పాయింట్ల పతనంతో ప్రారంభమైంది. అమ్మకాలు మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించాయి. ఐదు నిమిషాల్లోనే సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోయింది. ఉదయం 9.17 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 730 పాయింట్లు క్షీణించి 56467 వద్ద, నిఫ్టీ 235 పాయింట్ల పతనంతో 16,936 వద్ద ట్రేడవుతున్నాయి. గత వారం, సెన్సెక్స్ 1141 పాయింట్లు లేదా దాదాపు 2 శాతం క్షీణించింది. 10 సంవత్సరాల US బాండ్ ఈల్డ్ 2.85 శాతంగా ఉంది. డాలర్ ఇండెక్స్ 101.25 స్థాయిలో ఉండగా, ముడి చమురు 103 డాలర్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు, 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి అంచనాను అమెరికా 70 బేసిస్​ పాయింట్లు తగ్గింది 7 శాతానికి పరిమితం చేయడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. బజాజ్​ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్​, బ్రిటానియా, హెచ్​యూఎల్​, టెక్​ మహీంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

శుక్రవారం నిఫ్టీ ముగిసిన స్థాయితో పోలిస్తే, SGX నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల పతనంతో ట్రేడవుతోంది. అంటే మార్కెట్ ఒత్తిడికి లోనవుతోంది. యుఎస్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా 210 పాయింట్ల (0.62 శాతం) క్షీణతను చూస్తోంది. మార్చి త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉండటంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. శుక్రవారం డోజోన్స్ 2.9 శాతం భారీ పతనంతో ముగిసింది. S&P 500 2.77 శాతం క్షీణతను నమోదు చేసింది.యుఎస్ ఫెడరల్ రిజర్వ్ చర్యను దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్‌లో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.12,300 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు, ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురవుతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఈ స్టాక్‌లలో కొనుగోలు సలహా

ఈరోజు ICICI బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, వోల్టాస్ , PVR వంటి స్టాక్‌లను గమనించండి. అన్ని బ్రోకరేజీలు ICICI బ్యాంక్ షేర్లలో కొనుగోలు చేయవచ్చని సలహా ఇస్తున్నాయి. జీఎస్ దీని టార్గెట్ ధరను రూ.938గా, సీఎల్ఎస్ఏ రూ.1050గా ఉంచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక్కో షేరుకు రూ.15.50 డివిడెండ్ ప్రకటించింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది.

ఈ కీలక ఒప్పందం గత వారం జరిగింది

బ్లాక్‌రాక్ PVR – 37613 షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు దాని వాటా 4.95 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగింది. అదే విధంగా, టి రోవ్ ప్రైస్ అసోసియేట్ 3.57 లక్షల వోల్టాస్ షేర్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు దాని వాటా 7.04 శాతం నుంచి 7.14 శాతానికి పెరిగింది.

ఇవి కూడా చదవండి: Viral Video: ఈ కాకి చాలా క్లెవర్.. ఒక్క ఐడియాతో దాని ఇంటినే మార్చేసింది.. ఏం చేసిందో తెలుసా..

Viral Video: ఒక రోజు ముందే వధూవరుల మధ్య ఆ పోటీ.. గెలిచిందెవరో తెలిస్తే షాక్..