SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆ సమయాల్లో బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎప్పుడంటే.?

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో లైట్ సేవలు..

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు అలెర్ట్.. ఆ సమయాల్లో బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎప్పుడంటే.?
SBI: ఎస్‌బీఐ తన కస్టమర్లకు ఎన్నో ఆఫర్లను ప్రవేశపెడుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పొదుపు ఖాతాలుతో పాటు వాహనాలకు సంబంధించిన లోన్లు, బంగారు రుణాలు, గృహ రుణాలు తదితర రుణాలపై కూడా ఆఫర్లు ప్రకటిస్తుంటుంది. ఇక తాజాగా పండగ సీజన్‌ ప్రారంభం కానున్న సందర్భంగా రిటైల్‌ కస్టమర్ల కోసం ఎస్‌బీఐ పలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కారు లోన్‌ కస్టమర్లకు 100 శాతం ప్రాసెసింగ్‌ రుసుము మినహాయింపుతోపాటు వాహనం ఆన్‌-రోడ్‌ ధరలో 90 శాతం వరకు రుణం పొందే సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

Updated on: Jul 15, 2021 | 9:11 PM

బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ, యోనో లైట్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖాతాదారులు తమకు సహకరించాలని కోరింది.

”జూలై 16వ తేదీ శుక్రవారం రాత్రి 10.45 గంటల నుంచి జూలై 17 అర్ధరాత్రి 1.15 గంటల వరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో, యోనో లైట్ సర్వీసులు నిలిచిపోతాయని బ్యాంక్ పేర్కొంది. ఈ సమయంలో కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు చేయొద్దని సూచించింది” ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. దీనిని ఖాతాదారులు గమనించాలని.. మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించడంలో తమకు సహకరించాలని ఎస్‌బీఐ అభ్యర్ధించింది.

Also Read:

పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!

Follow Us