Ayushman Card: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

Ayushman Card: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. అలాగే సీనియర్‌ సిటిజన్లకు కూడా హెల్త్‌కు సంబంధించి పథకాలను తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రవేశపెడుతున్న పథకాల్లో ఆయుష్మాన్ పథకం ఒకటి. దీని కింద కవరేజీని మరింత విస్తరించడానికి..

Ayushman Card: కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఈ స్కీమ్‌లో వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!

Updated on: Mar 14, 2025 | 7:52 PM

యుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY)లో 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లను చేర్చే చొరవను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. ఈ పథకం కింద ఆయుష్మాన్ వయ వందన కార్డు వయోపరిమితిని 60 సంవత్సరాలకు తగ్గించాలని, తద్వారా ఎక్కువ మంది వృద్ధులు దీని ప్రయోజనాలను పొందవచ్చని కమిటీ సూచించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలపై జారీ చేసిన కమిటీ నివేదికలో అనేక ముఖ్యమైన సిఫార్సులు చేసింది.

ఆయుష్మాన్ పథకం కింద కవరేజీని మరింత విస్తరించడానికి ఆయుష్మాన్ వయ వందన కార్డు వయస్సు ప్రమాణాలను సవరించాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ కార్డుకు అర్హత వయస్సు 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ. అయితే ప్రస్తుతం దీనిని 60 సంవత్సరాలకు తగ్గించాలని సూచించింది. ఈ మార్పు ప్రయోజనం అన్ని సీనియర్ సిటిజన్లకు వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందుబాటులో ఉండాలని కూడా కమిటీ సూచించింది. ప్రస్తుతం భారతదేశ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సౌకర్యాలను పొందుతున్నారు.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం త్వరలో జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయనుంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, సంతకం తేదీ ఇంకా నిర్ణయించలేదు. కానీ అది మార్చి 18న జరిగే అవకాశం ఉంది. ఈ ఒప్పందం తర్వాత ఢిల్లీ ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసిన దేశంలో 35వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా అవతరిస్తుంది. దీనితో ఈ పథకాన్ని అంగీకరించని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్ మాత్రమే.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Financial Planning: స్కీమ్‌ అంటే ఇది కదా మావ.. రూ.12 లక్షల పెట్టుబడితో రూ.3.60 కోట్లు పొందే ఛాన్స్‌!

దేశ రాజధానిలో AB-PMJAY అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం జాతీయ ఆరోగ్య అథారిటీ (NHA)తో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేయడానికి సిద్ధంగా ఉందని వర్గాలు తెలిపాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో ఈ పథకం ఒకటి. అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం AB-PMJAYని అమలు చేయడానికి నిరాకరించింది. దాని స్వంత ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది.

అక్టోబర్ 29న పొడిగింపు:

ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (AB-PMJAY) కింద దేశంలోని ఆర్థికంగా బలహీన జనాభాలో 40% మందికి ఆరోగ్య భద్రత అందించింది. ఈ పథకం కింద 12.37 కోట్ల కుటుంబాలు, అంటే దాదాపు 55 కోట్ల మంది ప్రజలు ప్రతి సంవత్సరం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల వరకు బీమా కవరేజీని పొందుతారు. తద్వారా వారు ఆసుపత్రిలో చేరినప్పుడు ఉచిత చికిత్స పొందవచ్చు. గత ఏడాది అక్టోబర్ 29న 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరికీ వారి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించడానికి ఈ పథకం పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇది కూడా చదవండి: PAN card: మీకు కొత్త పాన్‌ కార్డ్‌ కావాలా..? కేవలం 10 నిమిషాల్లోనే.. ఎలాగంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us