AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: కీలక అప్‌డేట్‌.. బ్యాంకులకు రూ.2000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో తెలుసా?

మే 2023లో రూ.2,000 నోట్లను వాడటం మానేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న ప్రజలు తమ బ్యాంకు నుండి సెప్టెంబర్ 30, 2023 వరకు వాటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. దీని తర్వాత బ్యాంకు నుండి ఈ నోట్లను మార్చుకోవడానికి అనుమతి 7 అక్టోబర్ 2023తో ముగిసింది. అయినప్పటికీ ఇవి ఇప్పటికీ చట్టబద్ధమైనవి. ఎవరి వద్దనైనా

RBI: కీలక అప్‌డేట్‌.. బ్యాంకులకు రూ.2000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో తెలుసా?
2000 Notes Updates
Subhash Goud
|

Updated on: May 04, 2024 | 1:57 PM

Share

మే 2023లో రూ.2,000 నోట్లను వాడటం మానేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న ప్రజలు తమ బ్యాంకు నుండి సెప్టెంబర్ 30, 2023 వరకు వాటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. దీని తర్వాత బ్యాంకు నుండి ఈ నోట్లను మార్చుకోవడానికి అనుమతి 7 అక్టోబర్ 2023తో ముగిసింది. అయినప్పటికీ ఇవి ఇప్పటికీ చట్టబద్ధమైనవి. ఎవరి వద్దనైనా ఉంటే వారు ఆర్బీఐ నుండి మార్చుకోవచ్చు. అయితే దాదాపు 7 నెలలు గడిచినా రూ.2000 నోట్లన్నీ ఇంకా ఆర్బీఐకి రాలేదు. ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. 97.76 శాతం రూ. 2,000 నోట్లు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇప్పుడు కూడా, రూ. 7,961 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. అయితే మే 19, 2023 న, రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి.

రూ.2000 నోట్లను ఇప్పటికీ మార్చుకోవచ్చా?

ఎవరైనా రూ.2,000 నోట్లను కలిగి ఉంటే వారు వాటిని దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బిఐ కార్యాలయాల్లో సులభంగా డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. అదనంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు రూ.2,000 బ్యాంకు నోట్లను తమ బ్యాంక్ ఖాతాల్లోకి క్రెడిట్ కోసం ఏదైనా పోస్ట్ ఆఫీస్ నుండి ఏదైనా ఆర్‌బీఐ జారీ చేసే కార్యాలయానికి ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో బ్యాంక్ నోట్ డిపాజిట్లు/మార్పిడిని అందించే 19 ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రూ.1,000, రూ.500 నోట్ల రద్దు తర్వాత నవంబర్ 2016లో రూ.2,000 బ్యాంకు నోట్లను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో కరెన్సీ డిమాండ్‌ను తీర్చడం ఈ దశ ఉద్దేశం. అయితే, ఇతర డినామినేషన్లలో తగినంత మొత్తంలో బ్యాంకు నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత 2018-19లో రూ. 2,000 బ్యాంకు నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ఆర్బీఐ తెలిపింది. రూ.2000 డినామినేషన్ బ్యాంకు నోట్లలో 89 శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి