AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: ఆర్బీఐ నిర్ణయంతో ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. మరింత పెరగనున్న ఈఎంఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులపై భారం పెంచడం ప్రారంభించాయి..

RBI: ఆర్బీఐ నిర్ణయంతో ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. మరింత పెరగనున్న ఈఎంఐ
Lending Rates
Subhash Goud
|

Updated on: Dec 10, 2022 | 9:26 AM

Share

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులపై భారం పెంచడం ప్రారంభించాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నుండి బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు తమ రుణ రేట్లను పెంచాయి. దీని తర్వాత అన్ని రకాల రుణాల ఈఎంఐ పెరిగింది. బుధవారం ఆర్బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు లేదా 0.35 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు ప్రకటించిన తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొదట తన ఖాతాదారులకు షాకిచ్చింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఒక సంవత్సరం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసీఎల్‌ఆర్‌) 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచబడింది. దీంతో ఏడాది కాలానికి బ్యాంకు ఎంసీఎల్ఆర్ 8.60 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ వ్యవధిలో రేటు 8.20%. ఇది 10 bps పెరిగింది. ఒక నెల వడ్డీ రేటు 8.30% నుండి ఐదు బేసిస్ పాయింట్లు పెరిగింది. మూడు, ఆరు నెలల రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ వరుసగా 8.35%, 8.45%కి పెంచింది. అదే సమయంలో రేట్లు ఒక సంవత్సరానికి 8.10% నుండి 8.60%కు పెంచింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) రిజర్వ్ బ్యాంక్ నుండి రెపో రేటును పెంచిన తర్వాత దాని రెపో బేస్డ్ లెండింగ్ రేట్లను (ఆర్‌బీఎల్‌ఆర్‌) 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీని తర్వాత, బ్యాంక్ ఆర్‌బీఎల్‌ఆర్‌ 9.10 శాతానికి పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. ఆర్బీఐ రెపో రేటును పెంచిన డిసెంబర్ 7, 2022 నుండి పెరిగిన కొత్త రేట్లు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వడ్డీ రేట్లు:

హెచ్‌డిఎఫ్‌సి, బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు మరో బ్యాంకు తన కస్టమర్ల భారం మోపింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) రుణ వడ్డీ రేట్లను ఎంసీఎల్‌ఆర్‌15 నుండి 35 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో పాటు, బ్యాంక్ రెపో లింక్డ్ లెండింగ్ రేటును 9.10 శాతానికి పెంచింది. పెరిగిన కొత్త రేట్లు 10 డిసెంబర్ 2022 నుండి వర్తిస్తాయి.

రెపో రేటు 6.25 శాతానికి పెంపు

సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాదిలో వరుసగా ఐదవ పెరుగుదల. తాజా పెంపుతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. రెపో రేటు నేరుగా బ్యాంక్, ఈఎంఐ నుండి తీసుకున్న రుణానికి సంబంధించినది. రెపో రేటు అనేది బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. అటువంటి పరిస్థితిలో రెపో రేటు తగ్గడం వల్ల, రుణం ఈఎంఐ తగ్గుతుంది. అయితే పెరుగుదల కారణంగా అన్ని రకాల రుణాలు ఖరీదైనవిగా మారనున్నాయి. దీంతో ఈఎంఐ కూడా పెరుగుతుంది. దీంతో బ్యాంకులు కూడా రేట్లు పెంచుతున్నాయి.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us