RBI: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. ఆ అప్‌డేట్‌ చేసేందుకు మరో మూడు నెలలు పొడిగింపు

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) KYC అప్‌డేట్ గడువును పొడిగించింది. సెంట్రల్ బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ గడువును 3 నెలల పాటు మార్చి 31, 2022 వరకు పొడిగించింది...

RBI: బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. ఆ అప్‌డేట్‌ చేసేందుకు మరో మూడు నెలలు పొడిగింపు

Updated on: Dec 30, 2021 | 3:08 PM

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) KYC అప్‌డేట్ గడువును పొడిగించింది. సెంట్రల్ బ్యాంక్ కేవైసీ అప్‌డేట్ గడువును 3 నెలల పాటు మార్చి 31, 2022 వరకు పొడిగించింది. ఇది వరకు డిసెంబర్ 31 వరకు గడువు ఉండేది. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనిశ్చితి కారణంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కేవైసీ కింద కస్టమర్‌లు తమ గుర్తింపు, చిరునామాకు సంబంధించిన రుజువును అందించాల్సి ఉంటుంది.

ఈ సంవత్సరం మేలో, కరోనా సెకండ్‌ వేవ్ దృష్ట్యా్ కేవైసీ చేయని బ్యాంకు ఖాతాలను డిసెంబర్ 31, 2021 వరకు స్తంభింపజేయబోమని ఆర్బీఐ అన్ని బ్యాంకులకు తెలిపింది. ఇంతలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులు డిసెంబర్ 31 తర్వాత కూడా ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాకు నామినీని జోడించవచ్చని తెలిపింది. అయితే, రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ ఒక ట్వీట్‌లో తన ఖాతాదారులకు వీలైనంత త్వరగా ఇ-నామినేషన్ చేయాలని సూచించింది.

ఈ-నామినేషన్ ద్వారా నామినీని చేర్చుకోవడానికి డిసెంబర్ 31 చివరి తేదీ ముగుస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. చందాదారులు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో నమోదు చేసుకున్న సభ్యులు మాత్రమే EPF పొదుపులను ఉపసంహరించుకోవచ్చు. అయితే సబ్‌స్క్రైబర్‌లు ఒకటి కంటే ఎక్కువ నామినీలను నామినేట్ చేయవచ్చు. అటువంటి నామినీలందరిలో వాటా శాతాన్ని కూడా నిర్ణయించవచ్చు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి బ్యాంక్ ఖాతాలకు కేవైసీ అవసరమై ఉంటుంది. బ్యాంకింగ్‌లో మాత్రమే కాకుండా డబ్బు లావాదేవీలు, అవసరమైన సేవలకు సంబంధించిన అన్ని సేవలలో కేవైసీ అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ రిస్క్ ఉన్న ఖాతాల కోసం 10 సంవత్సరాలకు ఒకసారి కేవైసీని అప్‌డేట్ చేయాలని బ్యాంకులకు సూచించబడింది. అయితే అధిక రిస్క్ ఉన్న ఖాతాదారులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కేవైసీ చేయాల్సి ఉంటుంది.

కేవైసీ అప్‌డేట్ ఇంట్లో కూర్చొని చేయవచ్చు..
ప్రస్తుతం కేవైసీ అప్‌డేట్ చేయడానికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేవైసీ ఆన్‌లైన్‌ ద్వారా కూడా చేయవచ్చు. అయినప్పటికీ చాలా మంది ఖాతాదారులు ఇంకా అప్‌డేట్ చేసుకోలేదు. అయితే కేవైసీ గురించి మీకు ఎవరైనా ఫోన్‌ చేసి వివరాలు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

New Bank Rules: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై జనవరి 2022 నుంచి కొత్త రూల్స్!

Nirmala Sitharaman: పీఎల్‌ఐ పథకం పెట్టుబడులను ఆకర్షిస్తుంది.. తయారీ, ఎగుమతులను ప్రోత్సహిస్తుంది..

Loading...
Unable to load recommendations.
Follow Us