నేటి ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటికే ముగిసింది. రెగ్యులర్ అజెండాను మంత్రి మండలి వాయిదా వేసింది. రతన్ టాటాకు సంతాపం వరకే కేబినెట్ భేటీ పరిమితం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముంబై బయల్దేరారు. ఆయన రతన్ టాటాకు అంతిమ నివాళులు ఆర్పించనున్నారు.
రతన్ టాటా.. ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజంగానే కాదు.. ఆయనో మానవతావాది కూడా.. రతన్ టాటా సక్సెస్ స్టోరీ ఎప్పటికీ యువతరాలకు స్ఫూర్తిదాయకమే. టాటా గ్రూప్ను ప్రజలకు మరింత చేరువు చేసి.. బిజినెస్పరంగా కంపెనీని మరింత ఉన్నతస్థాయిలో నిలిపింది రతన్ టాటా.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత్ మరో కోహినూర్ వజ్రాన్ని కోల్పోయిందన్నారు మహరాష్ట్ర సీఎం షిండే. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. రతన్టాటా పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం NCPA గ్రౌండ్కు తరలించారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలకు రెడీ అయ్యింది మహరాష్ట్ర ప్రభుత్వం. మధ్యాహ్నం మూడున్నర గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆయన మృతికి నివాళిగా ఇవాళ సంతాపదినంగా ప్రకటించింది.
టాటా గ్రూప్లో చేరిన వెంటనే రతన్ను పెద్ద పదవులు వరించలేదు. మొదట్లో ఓ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా పనిచేశాడు. అలా వివిధ టాటా గ్రూప్ వ్యాపారాలలో అనుభవం సంపాదించాడు. ఆ తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించబడ్డాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. టాటా గ్రూప్ సంస్థల్లో అనేక సంస్కరణలు చేపట్టాడు. ప్రతిభావంతులైన యువతను తీసుకురావడం ద్వారా వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించారు. కొద్ది కాలంలోనే గ్రూప్లోని చాలా కంపెనీలు విజయానికి బాటలు పడ్డాయి. ఆ తర్వాత పదేళ్లకు టాటా ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయ్యారు. 1991లో తన మామ JRD టాటా తర్వాత టాటా గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. JRD టాటా ఐదు దశాబ్దాలకు పైగా ఈ పదవిలో ఉన్నారు. 1868లో ఒక చిన్న వస్త్ర వ్యాపార సంస్థగా ప్రారంభమైన టాటా గ్రూప్ ఆ తర్వాత ఉప్పు నుంచి ఉక్కు వరకు కార్ల వరకు, సాఫ్ట్వేర్, పవర్ ప్లాంట్లు, విమానయాన సంస్థల వరకు వ్యాపారాలు విస్తరించాయి. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో శిఖరాలను అధిరోహించింది.
ప్రపంచంలోని ఆరు ఖండాల్లో 100కుపైగా దేశాలలో టాటా సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఈ దేశాల్లో 30కిపైగా కంపెనీలను స్థాపించారు. రతన్ టాటా 1962లో న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్లో బిఎస్ డిగ్రీని పొందిన తర్వాత ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటైన IBM లో జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ రతన్ తన మామ JRD ఒత్తిడితో ఆ ఆఫర్ను తిరస్కరించాడు. టాటా వ్యాపారాలను రతన్ కొనసాగించాలని కోరడంతో.. వెంటనే రతన్ దేశానికి వచ్చి మామయ్య సలహా మేరకు టాటా గ్రూప్ ఆఫ్ సంస్థల్లో చేరాడు.
105 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టాటా ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో రతన్ టాటా అనేక అపూర్వమైన పనులు చేశారు. రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్, టాటా ట్రస్ట్లు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడేందుకు పెట్టుబడులు పెట్టారు. ఆయన సారథ్యంలో నిర్మించిన కేన్సర్ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమ వైద్యశాలల్లో ఒకటిగా పేరుగాంచింది. ఎన్నో యేళ్లుగా రతన్ టాటా పతు సంస్థలు విద్యాసంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్లు విరాళంగా అందించారు. వీటిలో $70 మిలియన్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ, శాన్ డియాగో యూనివర్సిటీకి $50 మిలియన్లు విరాళంగా అందించారు.
22 ఏళ్లు టాటా గ్రూప్ చైర్మన్గా ఉన్న రతన్ టాటా తన కంపెనీలను లాభాల బాటలో పరుగులు పెట్టించారు. టాటా గ్రూప్స్ ఆదాయాలు 40 నుంచి 50 రెట్లు పెరిగాయి. 2011-12 సంవత్సరంలో మొదటిసారిగా $100 బిలియన్ల మార్కును దాటింది.
రతన్ టాటాను భారత ప్రభుత్వం మూడవ, రెండవ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్తో సహా అనేక పతకాలు, గౌరవాలతో సత్కరించారు. భారత్తోపాటు రతన్ టాటాను సింగపూర్, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు కూడా సత్కరించాయి. బ్రిటిష్ సామ్రాజ్యం అధినేత క్వీన్ ఎలిజబెత్ II కూడా రతన్ను గౌరవ నైట్ కమాండర్ బిరుదుతో సత్కరించారు.
1991లో JRD టాటా స్థానంలో టాటా గ్రూప్ మాతృ సంస్థ అయిన టాటా సన్స్ ఛైర్మన్గా రతన్ టాటా తొలిసారి నియమితుడయ్యాడు. అతను రెండుసార్లు ఈ పదవిలో ఉన్నారు. 1991 నుండి 2012 వరకు తొలిసారి, ఆ తర్వాత 2016 నుంచి 2017 వరకు రెండోసారి ఛైర్మన్గా వ్యవహరించారు.
రతన్ టాటా డిసెంబర్ 28, 1937న జన్మించారు. అతను నావల్ టాటా పెద్ద కుమారుడు. స్వదేశంలో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత న్యూయార్క్లోని ఐవీ లీగ్ సంస్థ కార్నెల్ నుంచి ఆర్కిటెక్చర్లో డిగ్రీ పట్టా పొందాడు. రతన్ టాటాకు 10 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తల్లిదండ్రులు నావల్ టాటా- సోనీ టాటా విడిపోయారు. దీంతో రతన్ తన అమ్మమ్మ నవాజ్బాయి వద్ద పెరిగారు. ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, నైతిక విలువలతో రతన్ను పెంచి పెద్ద చేసింది. అతను టెల్కో (ప్రస్తుతం టాటా మోటార్స్)లో తన కెరీర్ ప్రారంభించాడు. బ్లాస్ట్ ఫర్నేస్లో సున్నపురాయిని తవ్వే పని కూడా చేశాడు. సోనీ టాటాతో విడాకుల తర్వాత నావల్ టాటా రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య ద్వారా నోయెల్ టాటాకు జన్మనిచ్చారు. నోయెల్ టాటాకు మాయ, నెవిల్లే, లేహ్ టాటా.. అనే ముగ్గురు సంతానం ఉన్నారు.
రతన్ టాటాకు కుక్కలంటేనే కాదు కార్లు కూడా మహా ఇష్టం. రతన్ టాటా గతంలో హోండా సివిక్లో ప్రయాణించేవారు. హోండా సివిక్ తర్వాత, రతన్ టాటా టాటా గ్రూప్కు చెందిన టాటా నెక్సాన్ ఈవీలో ప్రయాణించడం ప్రారంభించారు. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కారును ఆయన వాడుతున్నారు. రతన్ టాటా గ్యారేజీలో ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిల్లో టాటా నానో కారు ఆయనకు చాలా ఇష్టం. టాటా నానో అతని డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. టాటా నానో మాత్రమే కాదు 2023లో టాటా ఇండికా 25వ వార్షికోత్సవం సమయంలో రతన్ టాటా ఇన్స్టాలో ఒక పోస్ట్ను షేర్ చేశారు. అందులో టాటా ఇండికా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కారుగా పేర్కొన్నారు. ఈ కారు తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని కూడా తన పోస్టులో పేర్కొన్నారు.
రతన్ టాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కుక్కల పట్ల తనకు ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. తనకు కుక్కల పట్ల ఉన్న ప్రేమ లోతైనదని, తాను జీవించి ఉన్నంత వరకు ఈ ధోరణి కొనసాగుతుందని చెప్పాడు. రతన్ టాటాకు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉందంటే.. జంతువుల కోసం ఏకంగా ఓ ఆసుపత్రే కట్టించాడు. దీనికి టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ అనే పేరు కూడా పెట్టారు. టాటా ట్రస్ట్స్ జంతు ఆసుపత్రిని 20 ఎకరాల్లో 165 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇది ఐదు అంతస్తుల భవనం.
రతన్ టాటా తండ్రి పేరు నావల్ టాటా. అయితే నావల్ టాటా కంటే ముందు అతని పూర్వికులెవరికీ ‘టాటా’ అనే ఇంటిపేరు లేదు. నావల్ టాటాకు 13 ఏళ్లు ఉన్నప్పుడు JN పెటిట్ పార్సీ అనాథాశ్రమంలో చదువుతుండగా అనుకోకుండా ఆయన పేరులో ‘టాటా’ చేరింది. 1917లో ప్రసిద్ధ పార్సీ పారిశ్రామికవేత్త, ప్రజా సేవకుడు జమ్సెట్జీ నసర్వాన్జీ టాటా కుమారుడు సర్ రతన్ టాటా, ఆయన భార్య నవాజ్బాయి ఆ అనాథ అశ్రమానికి వచ్చారు. అక్కడ ఆమె నావల్ని చూసింది. నవాజ్బాయికి నావల్ తెగ నచ్చేశాడు. అంతే.. అతనిని తన కొడుకుగా స్వీకరించింది. ఆ తర్వాత ‘నవల్’ టాటా కుటుంబంలో చేరి ‘నవల్ టాటా’ అయ్యాడు.
రతన్ టాటాకు సోదరులు లేరు. ఆయన తండ్రి నావల్ టాటా రెండో భార్య కుమారుడు నోయెల్ టాటా మాత్రమే ఇప్పుడు ఉన్నాడు. రతన్ టాటాకి సవతి సోదరుడైన ఈయనకు ముగ్గురు సంతానం. మాయ, నెవిల్లే, లేహ్ టాటా. వీరిలో ఒకరు టాటా గ్రూప్ సంస్థలకు వారసులయ్యే అవకాశం ఉంది.
బాలీవుడ్ నటి సిమి గ్రేవాల్తో రతన్ టాటా కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడిచింది. రతన్ టాటా నటి సిమి గ్రేవాల్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. తాను నలుగురితో ప్రేమలో పడ్డానని, అయితే ప్రతిసారీ అదృష్టం కలిసిరాలేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రతన్ టాటా పెళ్లి చేసుకోవాలనుకున్న నటి సిమి గ్రేవాల్ కూడా పలుమార్లు వీరి లవ్ స్టోరీని మీడియాకు తెలిపారు. సిమి గ్రేవాల్ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో మాత్రమే కాకుండా, మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, జామ్నగర్ మహారాజు, వ్యాపారవేత్తతో కూడా లవ్ ట్రాక్ నడిపినట్లు తెలుస్తోంది.
లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన రతన్ టాటాకు సొంత వారసులు లేరు. అందుకు కారణం ఆయన ఆజన్మ బ్రహ్మచారి. వయసులో ఉన్నప్పుడు అయకు వరుసగా నాలుగు సార్లు లవ్ ఫెయిల్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచించకుండా వ్యాపారంపై పూర్తి దృష్టి కేంద్రీకరించినట్లు ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటా స్వయంగా తెలిపారు.
1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్నకు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్నకు రతన్ టాటా ఛైర్మన్గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రకటించింది.
టాటా గ్రూప్ను దాదాపు రెండు దశాబ్దాలకుపైగా కాలంలో ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పారిశ్రామిక వేత్తగానే కాకుండా దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. అనేక స్టార్టప్లను రతన్టాటా స్థాపించి, ప్రోత్సహించారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా యువతకు దిశానిర్ధేశం చేయడంలో ఆయన గొప్ప దార్శనికుడు అని చెప్పవచ్చు. ‘టాటా’ సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన గొప్ప వ్యాపార దిగ్గజంగా ఆయన నిలిచారు.
రతన్టాటా మరణం పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ, న అమిత్షా, రాజ్నాథ్, కిషన్రెడ్డితో సహా పలువురు సంతాపం తెలిపారు. భారత్ దిగ్గజ పారిశ్రామికవేత్తను కోల్పోయిందని రాష్ట్రనతి ముర్ము అన్నారు. దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త రతన్టాటా అని ప్రధాని మోదీ కొనియాడారు. సమాజహితం కోసం రతన్టాటా పనిచేశారని మోదీ అన్నారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రతన్టాటా వాణిజ్యరంగానికి ఆదర్శమూర్తి అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రతన్టాటా గొప్ప మానవతావాది అని కేటీఆర్ పేర్కొన్నారు.
రతన్టాటా మృతితో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. ప్రజల సందర్శనార్థం ఉ.10.30 గంటల నుంచి.. ముంబై-NCPA గ్రౌండ్లో రతన్టాటా భౌతికకాయం ఉంచనున్నట్లు రతన్ టాటా కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వ లాంఛనాలతో రతన్టాటా అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నిరంతర స్వాప్నికుడు, అలుపెరుగని శ్రామికుడు, భావితరాలకు మార్గదర్శకుడు అయిన రతన్టాటా తుదిశ్వాస విడిచారు. గొప్ప మానవతావాది కన్నుమూశారు. ఈ దేశం గర్వంగా చెప్పుకునే వ్యాపార సంస్థను నడిపించిన ఈ నాయకుడు, ఇక సెలవంటూ వెళ్లిపోయారు. ఆయన సేవలకు మెచ్చిన భారత ప్రభుత్వం రెండు అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. 2000లో పద్మభూషణ్ అవార్డు, 2008లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందించింది.
1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్గా రతన్ టాటా సేవలు అందించారు. 2016-17 మధ్య తాత్కాలిక చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. టాటా చారిటబుల్ ట్రస్టులకు కూడా రతన్టాటా చైర్మన్గా వ్యవహరించారు. అనేక స్టార్టప్లను ప్రోత్సహించిన రతన్టాటా.. దేశ పారిశ్రామిక, వాణిజ్యరంగ పురోగతిలో కీలకపాత్ర పోషించారు.
దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. రతన్ టాటా వంటి వారి దార్శనికత, చిత్తశుద్ధితో ఈ ప్రపంచంపై చిరస్థాయిగా ముద్ర వేసిన వారు చాలా అరుదని అన్నారు. ఈ రోజు మనం కేవలం ఒక వ్యాపార టైటాన్నే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈరోజు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందన్నారు. వారి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రజల సందర్శనార్ధం రతన్ టాటా పార్థివ దేహాన్ని గురువారం ముంబైలోని ఎన్సీపీఏలో ఉదయం 10.30 గంటల నుంచి ఉంచనున్నారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార దిగ్గజాలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలు గురువారం (అక్టోబర్ 10) సంతాప దినాలుగా ప్రకటించాయి. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎక్స్ వేధికగా తెలిపారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో గురువారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కూడా రాష్ట్రంలో ఒకరోజు సంతాప దినాలు ప్రకటించారు. జార్ఖండ్ వంటి వెనుకబడిన రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపును అందించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ పద్మవిభూషణ్ రతన్ టాటా మృతికి రాష్ట్రవ్యాప్తంగా ఒకరోజు సంతాపం ప్రకటించారు’ అని ‘X’లో ఒక పోస్ట్లో రాశారు.
చాలా కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు. ఆయన మృతితో దేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ రోజు సాయంత్రం రతన్ టాటా పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు.
ముంబై, అక్టోబర్ 10: బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) బుధవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఆయన మృతి పట్ల భారత రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిషాతో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో గురువారం నిర్వహిస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్స్ సంస్థలకు ఛైర్మన్గా వ్యవహరించిన రతన్ టాటా.. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్గా వ్యవహరించారు. రతన్ టాటా సేవలను గానూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ (2000), రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ (2008)తో సత్కరించింది.