MY HOME TARKSHYA: మైహోమ్ ప్రాజెక్ట్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. తర‌క్ష్యను వరించిన క్వాలిటీ ప్లాటినం అవార్డ్..

|

Oct 06, 2022 | 1:33 PM

తరతరాలపాటు తలెత్తుకుని జీవించేలా..ఇల్లాలి ముఖంలో చెరగని చిరునవ్వులా.. నిర్మాణరంగంలో 36 ఏళ్లుగా నమ్మకానికి ప్రతిరూపంగా నిలిచిన మై హోమ్‌‌కు మరో అవార్డ్ వరించింది.

MY HOME TARKSHYA: మైహోమ్ ప్రాజెక్ట్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం.. తర‌క్ష్యను వరించిన క్వాలిటీ ప్లాటినం అవార్డ్..
Hyderabad Real Estate (Representative Image)
Follow us on

మైహోమ్ గ్రూప్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ‘మైహోమ్ తర‌క్ష్య ప్రాజెక్ట్‌కి’ బెస్ట్‌ క్వాలిటీ అవార్డ్ దక్కింది. ఢిల్లీలోని జన్‌పథ్‌లో ఉన్న అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో ఈ అవార్డ్‌ సెర్మనీ జరుగుతోంది. మైహోమ్ గ్రూప్ తరఫున సీనియర్ మేనేజ్‌మెంట్‌ టీమ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చేతుల మీదుగా అవార్డ్‌ను స్వీకరించారు. 14th QCI-DL షా క్వాలిటీ ప్లాటినం అవార్డ్-సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా ఈ అవార్డ్స్ ప్రదానం జరుగుతోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మైహోమ్ గ్రూప్‌కి ఈ అవార్డు దక్కింది.

మైహోమ్‌ అంటే గృహాలనిర్మాణాలే కాదు.. కస్టమర్ల దగ్గర నమ్మకాన్ని కూడా నిర్మించామంది సంస్థ. అందుకే ఈ ప్రతిష్టాత్మక పురస్కారంను సొంతం చేసుకుంది.

మైహోమ్ తర‌క్ష్య ప్రాజెక్ట్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి