
Farmers: దేశంలోని కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ (PM-Kisan) పథకం అద్భుతంగా అమలవుతోంది. ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నాయి. తాజాగా ఈ పథకంలో కొత్తగా లబ్ధిదారులను చేర్చుకునే ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
గతంలో అనర్హులైన కోటి మందికి పైగా రైతులను జాబితా నుండి తొలగించిన కేంద్రం, ఇప్పుడు అర్హులైన కొత్త రైతులకు తలుపులు తెరిచింది.
మార్చి 13న 22వ విడత నిధులను విడుదల చేసిన కేంద్రం.. తదుపరి 23వ విడతను జూలై నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. మే, జూన్ నెలల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులకు ఇది సరైన సమయం. ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే జూలై నుండి రెగ్యులర్గా నగదు పొందే వీలుంటుంది. ముఖ్యంగా ఏపీ రైతులకు పీఎం కిసాన్తో పాటు ‘అన్నదాత సుఖీభవ’ పథకం ద్వారా అదనపు ప్రయోజనం కూడా చేకూరుతుంది.
ఇది కూడా చదవండి: Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు!
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి గడువు లేదు. రైతులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చు.
మీరు నేరుగా మీ సమీపంలోని మీ-సేవా లేదా CSC సెంటర్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ సుమారు రూ.50 ఛార్జీతో మీ వివరాలను నమోదు చేస్తారు. మీ ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ వివరాలను తీసుకెళ్తే సరిపోతుంది. అక్కడ సిబ్బంది మీ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేస్తారు.
మీరు దరఖాస్తు చేసిన తర్వాత మీ పేరు జాబితాలో చేరిందో లేదో ఇలా తనిఖీ చేసుకోండి:
ఇది కూడా చదవండి: Gold Jewellery: హైదరాబాద్లో బంగారం కొనాలా? తక్కువ ధరకే లభించే టాప్-3 ఏరియాలు ఇవే.. ఇక్కడ కొంటే భారీగా ఆదా!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి