AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఓటు వేయనందుకు మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతాయా? నిజమెంత..?

ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి డబ్బు తీసివేయబడుతుందని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో కూడా ఉంది. ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్న ఈ వార్తలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నట్లు ఈ వార్తల్లో పేర్కొన్నారు. ఓటు వేయని వారిని ఆధార్ కార్డు ద్వారా గుర్తించి ఆ కార్డుతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతా నుంచి రూ.350లను తీసివేయనున్నట్లు ఈ వార్తల్లో ఉంది..

Fact Check: ఓటు వేయనందుకు మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ అవుతాయా? నిజమెంత..?
Pib Fact Check
Subhash Goud
|

Updated on: Sep 16, 2023 | 4:09 PM

Share

ఓటు వేయడం ప్రతి సామాన్యుడి హక్కు. అటువంటి పరిస్థితిలో ఓటు వేయకపోతే వారి బ్యాంకు ఖాతా నుంచి రూ.350 తీసివేయబడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి సందేశం మీకు కూడా కనిపించ ఉండవచ్చు. వాస్తవానికి వచ్చే ఏడాది 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో ఎన్నికల కమిషన్‌ను ఉటంకిస్తూ, లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేయకపోవడం కొంత మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఈ సందేశం వైరల్‌ అవుతోంది. అంతేకాకుండా ఈ వార్త న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఫోటో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం.

ఒక వ్యక్తికి బ్యాంక్ ఖాతా లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి డబ్బు తీసివేయబడుతుందని వార్తాపత్రిక క్లిప్పింగ్‌లో కూడా ఉంది. ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్న ఈ వార్తలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నట్లు ఈ వార్తల్లో పేర్కొన్నారు. ఓటు వేయని వారిని ఆధార్ కార్డు ద్వారా గుర్తించి ఆ కార్డుతో అనుసంధానించబడిన వారి బ్యాంకు ఖాతా నుంచి రూ.350లను తీసివేయనున్నట్లు ఈ వార్తల్లో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇందులో నిజమెంత..?

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తన నిజనిర్ధారణలో ఈ వైరల్ వార్తల వాస్తవాన్ని పేర్కొంది. పీఐబీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వార్త పూర్తిగా ఫేక్. ఎన్నికల కమిషన్ ప్రతినిధి X ఖాతాలో కూడా ట్విట్‌ చేశారు. కొన్ని వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ వార్తలు మళ్లీ వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదే సమయంలో ఎన్నికల సంఘం అటువంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ స్పష్టం చేసింది. దీనిని ఎవ్వరు కూడా నమ్మి మోసపోవద్దని సూచించింది. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండండి, ఓటు వేయండి !! అయితే, ఓటు వేయమని ఎవరూ ఎవరినీ ఒత్తిడి చేయలేరు.. బ్లాక్ మెయిల్ చేయలేరు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే ఇటువంటి కంటెంట్‌ను నమ్మవద్దని పీఐబీ సూచించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
యాపిల్‌ ఫోన్‌ మినీ సిరీస్‌పై షాకింగ్ నిర్ణయం
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
8 గంటలు నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా ఉంటుందా? కారణం ఇదే..!
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
హైసెన్స్‌ ఏ10, ఏ10 అల్ట్రా ఫోన్‌ డిస్‌ప్లే గురించి తెలుసా
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టపడే హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
కేవలం సినిమా స్నాక్ మాత్రమే కాదు.. పాప్‌కార్న్‌తో ఈ లాభాలు తెల్సా
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
ఎలుక తోక ఎందుకు పొడవు ఉంటుంది? దీంతో ఏమైనా ఉపయోగం ఉంటుందా?
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్