No Helmet No Petrol: ఇక హెల్మెట్‌ లేకుంటే నో పెట్రోల్.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం

No Helmet No Petrol: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి బైక్‌ను నడపాలని ప్రభుత్వాలు, పోలీసులు పదేపదే చెబుతున్నా చాలా మంది హెల్మెట్‌ ధరించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ పంపుల్లో ఇంధనం పోయవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

No Helmet No Petrol: ఇక హెల్మెట్‌ లేకుంటే నో పెట్రోల్.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం

Updated on: Sep 03, 2025 | 4:47 PM

No Helmet No Petrol: భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు ఈ మరణాలను నివారించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒక పెద్ద చొరవ తీసుకుంది. ‘నో హెల్మెట్, నో ఫ్యూయల్’ ప్రచారం సెప్టెంబర్ 1, 2025 నుండి ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. దీని కింద హెల్మెట్ ధరించకుండా బైక్ లేదా స్కూటర్ నడిపే వారికి పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభించదు. రానున్న రోజుల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని కొందరు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: BMW Scooter: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్‌.. హెల్మెట్ లేకుండా నడపవచ్చు!

ఈ ప్రచారాన్ని ద్విచక్ర వాహన హెల్మెట్ తయారీదారుల సంఘం ప్రశంసించింది. అయితే వీటన్నింటిలోనూ పెద్ద సమస్య మార్కెట్లో నకిలీ హెల్మెట్లు వెల్లువెత్తడం, దీని గురించి అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టూ-వీలర్ హెల్మెట్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు రాజీవ్ కపూర్ మాట్లాడుతూ.. తక్కువ ధరల్లో లభించే హెల్మెట్లలో 95 శాతం నకిలీవని, ప్రజల ప్రాణాలను కాపాడటానికి బదులుగా, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ద్విచక్ర వాహనం అమ్మకంతో పాటు రెండు ఒరిజినల్ ఐఎస్ఐ సర్టిఫికేట్ పొందిన హెల్మెట్లను తప్పనిసరి చేయాలని కూడా ఆయన సూచించారు. అవగాహన ప్రచారాలతో పాటు ఈ నకిలీ హెల్మెట్ల సరఫరాపై కూడా కఠిన చర్యలు అవసరమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Zomato: పండగలకు ముందు కస్టమర్లకు షాకిచ్చిన జోమాటో.. భారీగా పెంచిన ఫీజు!

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని చాలా కంపెనీలు నాణ్యత లేని హెల్మెట్లు తయారు:

వ్యవస్థీకృత మార్కెట్లో హెల్మెట్లకు డిమాండ్ స్థిరంగా ఉందని, కానీ అసంఘటిత రంగం దీనిని సద్వినియోగం చేసుకుంటోందని రాజీవ్ కపూర్ అన్నారు. నకిలీ హెల్మెట్ తయారీదారులు నిరంతరం పనిచేస్తున్నారు. ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని , ఢిల్లీలోని కరారి వంటి ప్రాంతాల్లో రూ. 110 ధరకే నాణ్యత లేని హెల్మెట్‌లు పెద్ద మొత్తంలో అమ్ముడవుతున్నాయని ఆయన అన్నారు. ఈ నకిలీ హెల్మెట్‌లు ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Rate: సామాన్యులకు అదిరిపోయే శుభవార్త.. తులం బంగారం ధర రూ.36 వేలు!

ఢిల్లీలో అమ్ముడైన హెల్మెట్లలో దాదాపు 70 శాతం నకిలీవని నవభారత్ టైమ్స్ నివేదించింది. అవి ఒరిజినల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా విఫలమయ్యాయి. ప్రతి ద్విచక్ర వాహన అమ్మకంలో రెండు ఒరిజినల్ ISI సర్టిఫైడ్ హెల్మెట్‌లు తప్పనిసరి చేయాలని, వాటి ధరను మోటార్‌సైకిల్ లేదా స్కూటర్ ధరకు జోడించాలని రాజీవ్ కపూర్ సూచించారు. దీనివల్ల ఒరిజినల్ హెల్మెట్‌లు ముందుగా వినియోగదారులకు చేరుతాయని, నో హెల్మెట్, నో ఫ్యూయల్ నియమాన్ని విజయవంతంగా అమలు చేయవచ్చని ఆయన అన్నారు. మార్కెట్లో మరిన్ని ఒరిజినల్ హెల్మెట్‌లు ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టం ప్రజలను రక్షించడంలో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Smartphone: ఈ ఆరు యాప్స్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో తప్పకుండా ఉండాల్సిందే.. ఉపయోగం ఏంటో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి