AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..

భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టాన్ని పూర్తిగా సవరించింది. 1961 చట్టం రద్దు చేయబడి, 2025 చట్టం 2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. TDS, TCS నియమాలు సరళీకృతం చేయబడ్డాయి. ఉద్యోగులకు ప్రయాణ భత్యంపై మినహాయింపు పెరిగింది. డిజిటల్ ఆస్తులు కూడా పన్ను పరిధిలోకి వచ్చాయి.

కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..
New Income Tax Bill
SN Pasha
|

Updated on: Aug 28, 2025 | 1:51 PM

Share

భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి. 1961 నుండి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు. రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు 21, 2025న ఆమోదించారు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో పన్ను రేట్లు మారలేదు, కానీ మొత్తం వ్యవస్థ ఇప్పుడు సరళంగా, స్పష్టంగా, అర్థమయ్యేలా చేశారు. ఇప్పుడు సామాన్యులు కూడా పన్ను నియమాలను అర్థం చేసుకోగలుగుతారు. కంపెనీలు కూడా పత్రాల గందరగోళం నుండి ఉపశమనం పొందుతాయి.

TDS నియమాలు సరళంగా..

పాత చట్టంలో TDS (పన్ను మినహాయింపు), TCS (పన్ను వసూలు) నియమాలు 71 వేర్వేరు విభాగాలలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు వీటిని కలిపి కేవలం 11 విభాగాలుగా సంకలనం చేశారు. ఇప్పుడు ఎవరు ఎంత పన్ను తగ్గించాలి, దేనిపై ఆదాయపు పన్ను విధించబడుతుంది, ఎవరికి మినహాయింపు లభిస్తుంది, ఇవన్నీ స్పష్టంగా ఒకే చోట చేర్చారు. దీనివల్ల సామాన్యులకు ప్రయోజనం చేకూరుతుంది, కానీ కంపెనీలు నివేదికలను సిద్ధం చేయడం కూడా సులభం అవుతుంది.

ఉద్యోగులకు ఉపశమనం..

కొత్త చట్టంలో సామాన్య శ్రామిక ప్రజలకు కూడా ఉపశమనం లభించింది. గతంలో కంపెనీ మీకు ఆఫీసుకు వెళ్లి రావడానికి వాహనాన్ని అందించినట్లయితే, అది మాత్రమే పన్ను రహితంగా పరిగణించబడేది. ఇప్పుడు టాక్సీ, బస్సు లేదా మరేదైనా మార్గాల ద్వారా మీ ప్రయాణ ఖర్చును కంపెనీ భరిస్తే, అది కూడా పన్ను నుండి మినహాయించబడుతుంది. మరొక పెద్ద మార్పు ఏమిటంటే ఇప్పుడు బంగారం, వెండి, నగదు లేదా విలువైన వస్తువులు మాత్రమే కాకుండా, బిట్‌కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు లేదా భవిష్యత్తులో డబ్బు సంపాదించగల ఏదైనా వస్తువును కూడా పన్ను కోణం నుండి పరిగణిస్తారు.

పన్ను అధికారులు నిశితంగా పరిశీలిస్తారు.

గతంలో పన్ను అధికారులు దాడులు చేసినప్పుడు ఇల్లు, దుకాణం లేదా కార్యాలయంలో ఉంచిన కాగితాలు, ఆస్తిని మాత్రమే తనిఖీ చేయగలిగేవారు. కానీ ఇప్పుడు చట్టం మారింది. ఇప్పుడు పన్ను అధికారులు డిజిటల్ పత్రాలను కూడా చూడగలుగుతారు. మీ ఇమెయిల్, మొబైల్, ల్యాప్‌టాప్, ఆన్‌లైన్ ట్రేడింగ్ ఖాతా, సోషల్ మీడియా కూడా ప్రతిదీ ఇప్పుడు దర్యాప్తు పరిధిలోకి వచ్చింది.

విదేశీ కంపెనీలకు నిబంధనలను కఠినతరం

గతంలో పన్ను ఆదా చేయడానికి ఇక్కడ, అక్కడ వారి ఆదాయాన్ని చూపించే విదేశీ లేదా అనుబంధ కంపెనీలకు నియమాలు కఠినతరం చేశారు. ఇప్పుడు ఒక కంపెనీలో 26 శాతం కంటే ఎక్కువ వాటా ఉంటే లేదా ఒక కంపెనీ నిర్వహణ, డబ్బు లేదా నియంత్రణ మరొక కంపెనీ చేతిలో ఉంటే, అది అనుబంధ కంపెనీగా (అసోసియేటెడ్ ఎంటర్‌ప్రైజ్) పరిగణిస్తారు. గతంలో ఈ రెండు షరతులను ఒకేసారి నెరవేర్చడం అవసరం, కానీ ఇప్పుడు ఒకటి కూడా సరిపోతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి