
సెప్టెంబర్ 22 సోమవారం నుండి దేశ్యాప్తంగా జీఎస్టీ 2.0 సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వాహనాలు, వాటి విడిభాగాలపై GST 28 శాతం నుండి 18 శాతానికి తగ్గుతుంది. ప్రభుత్వ కోరిక మేరకు GST తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించాలని అన్ని ఆటోమొబైల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ఆయా కంపెనీల ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించాయి. కంపెనీలు విడుదల చేసిన వివరాల ప్రకారం.. మారుతి సుజూకీ కార్ల ధర రూ.1.29 లక్షల వరకు తగ్గుతుంది. ప్రీమియం కార్లైన ఆడి కార్ల ధర రూ.10 లక్షల వరకు తగ్గుతుంది. మెర్సిడెస్-బెంజ్, ల్యాండ్ రోవర్ బ్రాండ్ల కొన్ని కార్ల ధరలు రూ.30 లక్షల వరకు తగ్గనున్నాయి.
హ్యుందాయ్ కార్లపై తగ్గనున్న ధరలు
మారుతి సుజూకీ కార్లపై తగ్గనున్న ధరలు
టాటా మోటార్స్ కార్లపై తగ్గనున్న ధరలు
ప్రీమియం సెగ్మెంట్ కార్లపై భారీగా తగ్గనున్న ధరలు
కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తాయి. దీనిని ఊహించి, ఆగస్టు నుండి భారతదేశంలో కార్ల అమ్మకాలు బాగా తగ్గాయి. ఆగస్టు, సెప్టెంబర్లలో వాహన అమ్మకాలు ఎప్పుడూ లేనంతగా తగ్గుతాయని భావిస్తున్నారు. అక్టోబర్లో రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.