RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. సెలవు దినమైన ఆదివారం కూడా ఖాతాల్లో జీతం జమ.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

|

Jun 05, 2021 | 3:47 PM

RBI: ఉద్యోగుల జీతాలు అకౌంట్లో పడే సమయంలో ఆదివారం, లేదా బ్యాంకు సెలవు దినం వచ్చిందంటే చాలు జీతం కోసం వేచి ఉండాల్సిందే. వేతనం సొమ్ము ఖాతాలో క్రెడిట్‌ అయ్యేందుకు..

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. సెలవు దినమైన ఆదివారం కూడా ఖాతాల్లో జీతం జమ.. ఎప్పటి నుంచి అమలు అంటే..!
Follow us on

RBI: ఉద్యోగుల జీతాలు అకౌంట్లో పడే సమయంలో ఆదివారం, లేదా బ్యాంకు సెలవు దినం వచ్చిందంటే చాలు జీతం కోసం వేచి ఉండాల్సిందే. వేతనం సొమ్ము ఖాతాలో క్రెడిట్‌ అయ్యేందుకు బ్యాంకింగ్‌ సేవలు పునః ప్రారంభం అయ్యే వరకు ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేత నిర్వహించబడుతున్న భారీ చెల్లింపు వ్యవస్థ నాచ్‌.. ఒక ఖాతా నుంచి పలు ఖాతాల్లోకి జీతాలు, ఫించను, వడ్డీ, డివిడెండ్‌ను జమ చేసే ఎన్‌ఏసీహెచ్‌ (నాచ్‌) ప్రస్తుతం బ్యాంక్‌ పని దినాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు ముందుంటున్నామని ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత బ్యాంకు పని దినాలలో అందుబాటులో ఉన్న ‘నాచ్‌’ ఆగస్టు నుంచి వారంలో అన్ని రోజులలో అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటించారు.

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి నాచ్‌ వారంలో అన్ని రోజులూ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. అయితే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) నిర్వహణలో నాచ్‌.. బల్క్‌ పేమెంట్‌ వ్యవస్థ.. ఆటో క్రెడిట్‌ సేవలతో పాటు విద్యుత్‌, గ్యాస్‌, టెలిఫోన్‌, వాటర్‌, ఈఎంఐ, మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు, బీమా ప్రీమియం ఆటో డెబిట్‌ సేవలనూ అందిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ), సబ్సిడీ చెల్లింపులు సైతం ఈ వ్యవస్థ ద్వారానే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి ఆదివారం సెలవు దినాల్లో కూడా జీతం క్రెడిట్‌ కానుంది.

ఇవీ కూడా చదవండి:

SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. జూలై 1 నుంచి ఈ రూల్స్‌ మారనున్నాయి.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

SBI Account: మీరు ఎస్‌బీఐ ఖాతాను ఆన్‌లైన్‌లో వేరే బ్రాంచ్‌కు మార్చాలని అనుకుంటున్నారా..? మరింత సులభం