AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ఏజీఎంకు ముందు భారీ నష్టాన్ని చవి చూసిన ముఖేష్ అంబానీ

దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 35 లక్షల మంది పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే అంతకు ముందు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో ముఖేష్ అంబానీ కంపెనీ రూ.10 వేల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. బుధవారం కంపెనీ షేర్లలో 0.50 శాతం..

Mukesh Ambani: ఏజీఎంకు ముందు భారీ నష్టాన్ని చవి చూసిన ముఖేష్ అంబానీ
Mukesh Ambani
Subhash Goud
|

Updated on: Aug 28, 2024 | 4:21 PM

Share

దేశంలోని అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు 35 లక్షల మంది పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే అంతకు ముందు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో ముఖేష్ అంబానీ కంపెనీ రూ.10 వేల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. బుధవారం కంపెనీ షేర్లలో 0.50 శాతం క్షీణత కనిపించింది. దీని ప్రభావం కంపెనీ మార్కెట్ క్యాప్‌పై కూడా కనిపించింది. అయితే గతేడాది ఏజీఎం నుంచి ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 22 శాతం పెరిగాయి. బుధవారం AGMకి ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లలో ఎలాంటి గణాంకాలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం.

కంపెనీ షేర్లలో పతనం:

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో బుధవారం స్వల్ప క్షీణత ఉంది. బిఎస్‌ఇ డేటా ప్రకారం, ట్రేడింగ్ సెషన్‌లో రిలయన్స్ షేర్లు 0.50 శాతం పడిపోయి రూ.2985.35కి చేరుకున్నాయి. అయితే మధ్యాహ్నం మార్కెట్ ముగిసే 15 నిమిషాల ముందు కంపెనీ షేర్లు 0.25 శాతం క్షీణతతో రూ.2993.05 వద్ద ట్రేడవుతున్నాయి. అయితే, ఒక రోజు ముందు కంపెనీ షేర్లు రూ.3000.45 వద్ద ముగిశాయి. ఆగస్టు 8న కంపెనీ షేర్లు రికార్డు స్థాయిలో రూ.3,217.90కి చేరాయి.

ఒక్క ఏడాదిలో 22 శాతానికి పైగా పెరిగింది

గత సంవత్సరం అంటే 2023లో కంపెనీ ఏజీఎం ఆగస్టు 28న జరిగింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ షేరు రూ.2,442.55 వద్ద ఉంది. ఇందులో ఇప్పటి వరకు 22 శాతానికి పైగా వృద్ధి కనిపించింది. విశేషమేమిటంటే కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3.50 లక్షల కోట్లకు పైగా పెరిగింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రిలయన్స్ షేర్లు 3500 రూపాయలకు చేరుకోవచ్చు.

10 వేల కోట్ల మేర కంపెనీ నష్టపోయింది

బుధవారం నాటి షేర్ల పతనం కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించింది. ట్రేడింగ్‌లో కంపెనీ మార్కెట్ క్యాప్‌లో రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. డేటా ప్రకారం.. స్టాక్ మార్కెట్ ఒక రోజు క్రితం ముగిసినప్పుడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20,29,540.61 కోట్లుగా ఉంది. ఇది ట్రేడింగ్ సెషన్‌లో రూ.20,19,326.79 కోట్లకు తగ్గింది. అంటే ట్రేడింగ్‌లో కంపెనీ రూ.10,213.82 కోట్ల నష్టాన్ని చవిచూసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!