Expensive Citys: భారత్‌లో అత్యంత ఖరీదైన నగరాలు ఏవో తెలుసా? జాబితాతో హైదరాబాద్‌

సగటు కుటుంబానికి నెలవారీ ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) నుంచి ఆదాయ నిష్పత్తి పెరిగినా లేదా తగ్గిపోయినా సూచిక ట్రాక్ చేస్తుంది. ఆపై ఫలితాలను అందిస్తుంది. అఫర్డబిలిటీ ఇండెక్స్ ఒక నిర్దిష్ట నగరంలోని హౌసింగ్ యూనిట్ నెలవారీ ఈఎంఐకి నిధులు సమకూర్చడానికి అవసరమైన ఆదాయ నిష్పత్తిని లెక్కించడానికి ప్రయత్నిస్తుంది. ఇక అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై, హైదరాబాద్‌ల తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లు ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై, బెంగళూరులు ఉన్నాయి. కోల్‌కతా..

Expensive Citys: భారత్‌లో అత్యంత ఖరీదైన నగరాలు ఏవో తెలుసా? జాబితాతో హైదరాబాద్‌
Expensive Citys

Updated on: Aug 18, 2023 | 3:07 PM

భారత దేశంలో పలు నగరాల్లో నివాసించాలంటే ఎంతో ఖరీదైనవిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నివాసించాలంటే ఇంటి అద్దె, ఖర్చులు తదితర వివరాలను చూసుకుంటే చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. అయితే దేశంలో ఏయే నగరాల్లో నివసించాలంటే అత్యంత ఖర్చు అవుతుందనే విషయమై సర్వే జరిగింది. సర్వే ప్రకారం.. ముంబైలో వివసించడానికి అత్యంత ఖరీదైన నగరంగా మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ విడుదల చేసిన అఫర్డబిలిటీ ఇండెక్స్ డేటా ప్రకారం.. హైదరాబాద్ రెండవ అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. 2023 మొదటి ఆరు నెలల డేటా అహ్మదాబాద్‌ను భారతదేశంలో అత్యంత సరసమైన నగరంగా చూపిస్తుంది. సగటు కుటుంబ ఆదాయానికి సమానమైన నెలవారీ వాయిదాల నిష్పత్తి ఆధారంగా కనుగొన్నది.

సగటు కుటుంబానికి నెలవారీ ఈఎంఐ ఇన్‌స్టాల్‌మెంట్ (EMI) నుంచి ఆదాయ నిష్పత్తి పెరిగినా లేదా తగ్గిపోయినా సూచిక ట్రాక్ చేస్తుంది. ఆపై ఫలితాలను అందిస్తుంది. అఫర్డబిలిటీ ఇండెక్స్ ఒక నిర్దిష్ట నగరంలోని హౌసింగ్ యూనిట్ నెలవారీ ఈఎంఐకి నిధులు సమకూర్చడానికి అవసరమైన ఆదాయ నిష్పత్తిని లెక్కించడానికి ప్రయత్నిస్తుంది.

ఇక అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ముంబై, హైదరాబాద్‌ల తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లు ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై, బెంగళూరులు ఉన్నాయి. కోల్‌కతా, పూణే, చివరకు అహ్మదాబాద్ ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరం హాంకాంగ్‌ అగ్రస్థానంలో ఉంది. దేశంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను పరిశీలిస్తే..

ఇవి కూడా చదవండి
  • ముంబై – 55 శాతం
  • హైదరాబాద్ – 31 శాతం
  • ఢిల్లీ-NCR – 30 శాతం
  • చెన్నై – 28 శాతం
  • బెంగళూరు – 28 శాతం
  • కోల్‌కతా – 26 శాతం
  • పూణే – 26 శాతం
  • అహ్మదాబాద్ – 23 శాతం

శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రకారం.. ‘గృహాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. రెసిడెన్షియల్ మార్కెట్‌లోని మధ్య, ప్రీమియం విభాగాలు నిలకడగా మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. మార్కెట్‌లో గణనీయమైన మార్పును సూచిస్తున్నాయి. అయితే, పాలసీ రేట్లలో 250 bps పెరుగుదల సగటున మార్కెట్‌లలో 2.5% స్థోమతను తగ్గించింది. అయితే, మార్కెట్ ఇప్పటివరకు బలంగా ఉంది. మరింత వడ్డీ రేటు పెరుగుదల గృహ కొనుగోలుదారు సామర్థ్యం పెరిగింది.’

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us