PM Modi: ఈ పథకాలపై ప్రజలకు గుడ్‌న్యూస్‌.. మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందా..?

|

Jun 26, 2024 | 8:51 PM

మోడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మూడో సారి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్‌.. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల కోసం ప్రవేశపెడుతున్న వివిధ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ నిర్ణయాలు ఏంటో తెలుసుకుందాం..

PM Modi: ఈ పథకాలపై ప్రజలకు గుడ్‌న్యూస్‌.. మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందా..?
Pm Modi
Follow us on

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు మేలు చేసే కొన్ని సేవలను తీసుకొచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై) వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఈ పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిన్న పొదుపు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వం పథకాలపై వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. అదే సమయంలో జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లపై జూన్ 30 నాటికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

లక్షలాది మంది చిన్న పొదుపుదారులకు లబ్ధి:

ఇవి కూడా చదవండి

విభవంగల్ అనుకూల్‌కరా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మౌర్య మాట్లాడుతూ.. పీఎఫ్‌, ఈఎస్‌ఏఎఫ్‌, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రభుత్వానికి సున్నితమైన రాజకీయ అంశాలు. అయితే, లక్షలాది మంది చిన్న పొదుపుదారులకు ప్రయోజనం చేకూర్చేలా వడ్డీ రేట్లను పెంచాలనే ఒత్తిడి ఉంది.

ఖాతాదారులు బ్యాంకు డిపాజిట్లకు దూరంగా ఉంటే సమస్యలు:

వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని, ఆర్థిక లోటు పెరిగే అవకాశం ఉందని మౌర్య అన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఆర్‌బిఐ ద్రవ్య విధానం, బ్యాంకు డిపాజిట్ రేట్లతో సహా స్థూల ఆర్థిక వాతావరణానికి వ్యతిరేకంగా పరిగణించాలి. ఖాతాదారులు బ్యాంకు డిపాజిట్లకు దూరంగా ఉంటే, మరిన్ని సమస్యలు తలెత్తవచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడులకు వడ్డీ రేట్లలో మార్పులు:

అక్యూబ్ వెంచర్స్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. వడ్డీ రేట్ల పెంపు గృహ పొదుపులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తుందని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో గృహ పొదుపులు స్థిరంగా ఉన్నాయి. అగర్వాల్ ప్రకారం, ట్రెజరీపై అనవసరమైన ఒత్తిడి లేకుండా పొదుపును ప్రోత్సహించడానికి దీర్ఘకాలిక పెట్టుబడులకు వడ్డీ రేట్లను మార్చడం ద్వారా ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరించాలి.

  • పీపీఎఫ్‌పై మునుపటిలా 7.1 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
  • సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్ చేసిన మొత్తానికి 8.2 శాతం వడ్డీ చెల్లిస్తారు.
  • మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ 7.1 శాతం.
  • పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ డిపాజిట్ పై వడ్డీ రేటు 4 శాతం.
  • కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతం.
  • నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)పై వడ్డీ రేటు 7.7 శాతం.
  • ప్రస్తుత త్రైమాసికం నాటికి నెలవారీ ఆదాయ ప్రణాళిక వడ్డీ రేటు 7.4 శాతం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి