AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు మెడికల్ సేల్స్‌మెన్లు.. ఇప్పుడు బడా వ్యాపారవేత్తలు.. కండోమ్స్ బిజినెస్‌తో కోట్లు కొల్లగొట్టారు!

మేన్‌కైండ్‌ ఫార్మా.. ఈ పేరు గురించి మీరు వినే ఉంటారు. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్స్, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్‌లను విక్రయించే ఈ పాపులర్ బ్రాండ్..

అప్పుడు మెడికల్ సేల్స్‌మెన్లు.. ఇప్పుడు బడా వ్యాపారవేత్తలు.. కండోమ్స్ బిజినెస్‌తో కోట్లు కొల్లగొట్టారు!
Condoms
Ravi Kiran
|

Updated on: Apr 25, 2023 | 1:12 PM

Share

మేన్‌కైండ్‌ ఫార్మా.. ఈ పేరు గురించి మీరు వినే ఉంటారు. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్స్, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్‌లను విక్రయించే ఈ పాపులర్ బ్రాండ్.. ఐపీఓకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ డ్రగ్ కంపెనీని ప్రారంభించింది జునేజా సోదరులు. మెడికల్ సేల్స్‌మెన్లుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వీరిద్దరూ.. పట్టు వదలని విక్రమార్కులా ఈ మేన్‌కైండ్‌ ఫార్మాను ఏకంగా రూ. 43, 264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. రూ. 4,326 కోట్ల పబ్లిక్ ఆఫర్‌ను ఈ సంస్థ ఏప్రిల్ 25న ప్రారంభించి.. ఏప్రిల్ 27న ముగించడానికి సిద్దంగా ఉంది. ఈ ఏడాది స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టు అవుతున్న ఏడో ఐపీఓ ఇది.

రమేష్ జునేజా, రాజీవ్ జునేజా.. ఈ ఇద్దరు సోదరులు తమ ప్రయాణాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్‌‌లుగా మొదలుపెట్టారు. 1974లో రమేష్ జునేజా కీఫార్మా అనే కంపెనీలో మెడికల్ సేల్స్‌మెన్‌గా పని చేశారు. ఆ తర్వాత లుపిన్ అనే ఫార్మా కంపెనీలో ఎనిమిదేళ్లు చేసి.. 1995లో తన సోదరుడు rajeev జునేజాతో కలిసి మేన్‌కైండ్ ఫార్మాను ప్రారంభించారు. రూ. 50 లక్షల పెట్టుబడితో, 25 మంది వైద్య సిబ్బందితో అప్పట్లో ఈ సంస్థను ప్రారంభించారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. తమ స్కిల్స్, కార్పోరేట్ వ్యూహాలతో అంచలంచలుగా ఎదిగి రూ. 43,264 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించారు. ముఖ్యంగా వీరు 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో చేయించిన ప్రకటనలను మధ్యతరగతి వారిని బాగా ఆకర్షించాయి.

మేన్‌కైండ్ ఐపీఓ విషయానికొస్తే.. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా బీఎస్ఈ, ఎన్ఎస్‌సీలో 40,058,844 ఈక్విటీ షేర్లను జాబితా చేయాలని సంస్థ ప్రతిపాదించింది. దీనికి ప్రమోటర్లుగా రమేష్ జునేజా, రాజీ జునేజా, సీఈఓ శీతల్ అరోరా, కైర్న్‌హిల్ CIPEF, కైర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్, లింక్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వ్యవహరిస్తారు. అలాగే ఒక్కో షేర్ ప్రైస్ రూ. 1026-1080గా నిర్ణయించారు. కాగా, మే 3న మేన్‌కైండ్ IPO షేర్ కేటాయింపును ఖరారు చేస్తుంది. అలాగే మే 4వ తేదీకి అర్హత సాధించని ఇన్వెస్టర్లకు రీఫండ్‌ డబ్బులు జమ కాగా.. మే 8న అర్హులైన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు షేర్లు బదిలీ అవుతాయి.(Source)

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే