
యూపీఐ ద్వారా చిల్లర ఇబ్బందులు లేకుండా సురక్షితంగా డబ్బులను పంపుకోవచ్చు. అయితే ఇదే సమయంలో యూపీఐ లావాదేవీలలో మోసాలు కూడా పెరిగిపోయాయి. వాటి నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. దేశంలో 2016లో యూపీఐ లావాదేవీలు మొదలయ్యాయి. ప్రారంభంలో నామమాత్రంగానే ఉన్నా, ఆ తర్వాత కాలంలో విపరీతంగా పెరిగాయి. కాల క్రమీణా పెరుగుతూ 2024-25 నాటికి 34.5 శాతానికి పెరిగి, 90.7 లక్షల నుంచి 1.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. యూపీఐ ద్వారా లావాదేవీలు చాలా సులభంగా చేసే వీలు ఉండడంతో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో 2024 మొదటి అర్ధభాగంలో రూ.485 కోట్ల విలువైన 6.32 లక్షల యూపీఐ చెల్లింపు మోసాల కేసులు నమోదయ్యాయి. దాని ముందు ఏడాది 13.42 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి.
పెరుగుతున్న మోసాలను అదుపు చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పలు రకాల భద్రతా చర్యలు చేపడుతోంది. అయినా వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించాలంటే ప్రజలకు అవగాహన పెంచుకోవాలి. డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పూర్తిస్థాయిలో తెలుసుకోవాలి. ముఖ్యంగా యూపీఐ విధానంలో డబ్బులను స్వీకరించడానికి మీరు ఎలాంటి క్యూాఆర్ కోడ్ ను స్కాన్ చేయనవసరం లేదు. యూపీఐ పిన్ కూడా నమోదు చేయకూడదు. డబ్బులు పంపించే వ్యక్తికి మీ ఫోన్ నంబర్ పంపిస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..