Digital Payments: వీధి విక్రేతలకు కేంద్ర సర్కార్ శిక్షణ.. డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు కొత్త ప్లాన్..

భారతదేశంలో ప్రస్తుతం ఎగువ తరగతి, మధ్యతరగతి ప్రజలు మాత్రమే పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే దిగువ తరగతి, చిన్న వ్యాపారులలో డిజిటల్ చెల్లింపుల గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నారు.

Digital Payments: వీధి విక్రేతలకు కేంద్ర సర్కార్ శిక్షణ.. డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు కొత్త ప్లాన్..
Digital Payments

Updated on: Sep 12, 2021 | 1:53 PM

డిజిటల్ ఇండియాగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు విజయవంతం అవడంతో మరిన్ని కొత్త పథకాలను తీసుకొస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం డిజిటల్ లావాదేవీలు పెరగడంతో రికార్డు స్థాయిలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఇండియాలో డిజిటల్ చెల్లింపులకు గత కొద్దికాలంగా ప్రాధాన్యత పెరుగుతోంది. దేశంలో డీ మోనిటైజేషన్ అమలైనప్పటి నుంచే డిజిటల్ లావాదేవీలు ప్రాచుర్యంలో వచ్చినా.. కరోనా సంక్షోభం సమయంలో విపరీతంగా పెరిగాయి. మరోవైపు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు సైతం డిజిటల్ లావాదేవీలు చేరడంతో మరింతగా ప్రాచుర్యం పొందింది. చిన్న చిన్న కొనుగోళ్లు సైతం డిజిటల్ లావాదేవీలతో నడుస్తున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్ పేమెంట్లు పెరిగాయి. ఆగస్టు నెలలో అన్ని పేమెంట్ యాప్‌ల నుంచి డిజిటల్ చెల్లింపులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

భారతదేశంలో ప్రస్తుతం ఎగువ తరగతి, మధ్యతరగతి ప్రజలు మాత్రమే పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే దిగువ తరగతి, చిన్న వ్యాపారులలో డిజిటల్ చెల్లింపుల గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. వీధి విక్రేతలకు డిజిటల్ చెల్లింపుల ద్వారా చెల్లింపులు చేయడానికి.. స్వీకరించడానికి శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ‘మెయిన్ భీ డిజిటల్ 3.0’ క్యాంపెయిన్ ప్రారంభించబోతున్నారు.

ప్రధానంగా నగదు లావాదేవీలు జరిపే సంప్రదాయ దేశంగా ఉన్న మన భారత్‌లో.. అత్యంత తక్కువ సమయంలో డిజిటల్ చెల్లింపులను అందిపుచ్చు కోవం చెప్పుకోతగ్గ విషయమే నంటున్న ఆర్ధిక నిపుణులు. అయితే 2016లో విభిన్న అంశాలు తీవ్రస్థాయిలో ప్రభావితం చేయడంతో డిజిటల్‌ చెల్లింపులు క్రమంగా ఊపందుకోవడం మొదలయ్యాయి. పెద్దసంఖ్యలో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో పాటు హైస్పీడ్‌ డేటా రావడంతో వీటి వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది.

రెండు మంత్రిత్వ శాఖల ఉమ్మడి ప్రయత్నం ఈ పథకం..

ఈ ప్రచారంలో గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి  దేశంలోని 223 నగరాల్లో వీధి విక్రేతలకు PM SVANIDI పథకం కింద శిక్షణ ఇస్తుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా, ఎలక్ట్రానిక్స్ , సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సాహ్నీ సంయుక్తంగా ఈ పథకాన్ని వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించారు.

డిజిటల్ పేమెంట్ కంపెనీలు 

ఫోన్‌పే, పేటీఎం, భారత్‌పే సహా దేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపు కంపెనీలు కూడా ప్రభుత్వ ఈ ప్రయత్నాలలో కలిసిపోయాయి. ఈ కంపెనీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వీధి విక్రేతలకు డిజిటల్ చెల్లింపులు, UPI ID, QR కోడ్ గురించి శిక్షణ ఇస్తాయి. దీనితో పాటు, వారు డిజిటల్ చెల్లింపుకు సంబంధించిన అన్ని అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. వీధి విక్రేతలను ఏర్పాటు చేసే చిన్న, తక్కువ విద్యావంతులైన వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను చేయగలుగుతారు.

తక్కువ వడ్డీతో రుణం..

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు వీధి విక్రేతలకు తక్కువ వడ్డీ రేట్లు, నామమాత్రపు నిబంధనల మేరకు రుణాలు ఇవ్వబడుతున్నాయి. తద్వారా వారు తమ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకు సుమారు 45.5 లక్షల మంది వీధి విక్రేతలు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 27.2 లక్షల మంది దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు చేయబడ్డాయి. 24.6 లక్షల దరఖాస్తుదారులు రుణాలు ఇచ్చారు. ఈ పథకం కింద, ఇప్పటివరకు రూ. 2444 కోట్లు వీధి విక్రేతలకు అందించబడ్డాయి. సమాచారం ప్రకారం, 70,448 రుణగ్రహీతలు కూడా మొదటి విడత చెల్లించారు.

ఇవి కూడా చదవండి: Chirutha: అనుకున్నట్లుగానే చిక్కింది.. ఫారెస్ట్ అధికారుల ప్లాన్ ఫలించింది.. బోన్‌లో పడిన చిరుతను..

Biryani: బిర్యానీ తిన్నారు.. చికెట్ వంటకాలు లాగించారు.. ఇంటికి వెళ్లారు.. కట్ చేస్తే..

Loading...
Unable to load recommendations.
Follow Us