IRCTC Emergency Quota: ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా.. లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.. వారికి మాత్రమే ప్రత్యేకం

భారతదేశంలో రైలు ప్రయాణం అనేది చాలా చౌకైన ప్రయాణ సాధనంగా ఉంటుంది. అయితే రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం అనేది సామాన్యులకు పహసనంగా మారుతుంది. సీట్ కన్‌ఫర్మ్ కాకపోతే ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంత మందికి ఎమెర్జెన్సీ కోటా అందుబాటులో ఉంటుందని చాలా మందికి తెలియదు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కోటా అందుబాటులో ఉంటుంది.

IRCTC Emergency Quota: ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా.. లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.. వారికి మాత్రమే ప్రత్యేకం

Updated on: Dec 21, 2024 | 6:59 PM

భారతదేశంలోని ప్రజలు చాలా మంది  రైలులో ప్రయాణించడాన్ని ఆశ్వాదిస్తారు. అయితే మీ సీటు కన్ఫర్మ్ అయితేనే అది ఆనందదాయకంగా ఉంటుంది. మీ టికెట్ ధ్రువీకరణ కాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా సెలవుల సమయంలో వెయిటింగ్ ప్రయాణికులను వేధిస్తుంది. ప్రయాణీకులు కొన్నిసార్లు కన్ఫార్ట్ టిక్కెట్ లేకుండా ప్రయాణించవచ్చు. అయితే కొన్ని పరిస్థితులలో రైల్వేలు మీ వెయిటింగ్ టిక్కెట్‌ను నిర్ధారించగలవని తెలుసుకోవడం ముఖ్యం. కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు వంటి ఉన్నత అధికారిక అభ్యర్థన (హెచ్ఓఆర్) కలిగి ఉన్న ప్రయాణీకులు అత్యవసర కోటాను యాక్సెస్ చేయవచ్చు. వీరి తర్వాత రైల్వేలు ప్రభుత్వ విధుల కోసం ప్రయాణించడం, కుటుంబ అత్యవసర పరిస్థితులు, అనారోగ్యం లేదా ఉద్యోగ ఇంటర్వ్యూల వంటి ఇతర అత్యవసర అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటాయి.

అత్యవసర కోటా కోసం దరఖాస్తు చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ, జోన్ కార్యాలయం లేదా డివిజన్ కార్యాలయాన్ని సందర్శించవచ్చు. అత్యవసర కోటా టికెట్ అభ్యర్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. మీరు మీ పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ రాయాలి. అలాగే మీ టికెట్ ఫోటోకాపీని, మీ ఎమర్జెన్సీని రుజువు చేసే మెడికల్ రిపోర్ట్ లేదా పరీక్ష నోటీసు వంటి ఏవైనా పత్రాలను చేర్చాలి. అలాగే ఆ లేఖలో మీ మొబైల్ నంబర్‌ను కచ్చితంగా పేర్కొన్నాలి.  అత్యవసర కోటా కోసం పది శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. ఒక్కో రైలులో 10 స్లీపర్ కోచ్‌లు ఉంటాయి అంటే ఒక్కో కోచ్‌లో 18 సీట్లు ఉంటాయి. అంటే 180 వెయిటింగ్ సీట్లు కన్ఫర్మ్ అవుతాయి. ఇదే నిబంధన ఏసీ కోచ్‌లకు కూడా వర్తిస్తుంది. 

అత్యవసర కోటా హోల్డర్లు, పార్లమెంటు సభ్యులు, ఇతర అత్యవసర అభ్యర్థనల అత్యవసర ప్రయాణ అవసరాల కోసం రిజర్వ్ చేస్తారు. రైల్వేలు దీర్ఘకాల వ్యవస్థ ఆధారంగా ఈ అభ్యర్థనలకు ప్రాధాన్యత ఇస్తాయి. వారు మొదట హెచ్‌ఓఆర్ హోల్డర్‌లకు వారి ర్యాంక్, సీనియారిటీ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అప్పుడు వారు పరిస్థితి, ఆవశ్యకత వంటి అంశాల ఆధారంగా ఇతర అభ్యర్థనలను పరిశీలిస్తారు. అత్యవసర కోటాను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి అన్ని జోనల్ రైల్వేలు తప్పనిసరిగా రాతపూర్వకంగా అభ్యర్థనలను ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అదనంగా ప్రస్తుత, మాజీ పార్లమెంటేరియన్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అంటే టూరిజం కార్పొరేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రత్యేక రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us