Bullet Train: గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న భారతదేశపు తొలి బులెట్ ట్రైన్.. బిగ్ అప్‌డేట్!

Bullet Train: బుల్లెట్ రైలు కారిడార్‌కు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ హై-స్పీడ్ రైలు కోసం 12 స్టాప్‌లను ఖరారు చేశారు. నివేదికల ప్రకారం, ఈ బుల్లెట్ రైలు కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీల..

Bullet Train: గుడ్‌న్యూస్‌.. పట్టాలెక్కనున్న భారతదేశపు తొలి బులెట్ ట్రైన్.. బిగ్ అప్‌డేట్!
Bullet Train

Updated on: Aug 13, 2026 | 6:34 PM

Bullet Train: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటి దశను 2027 ఆగస్టు 15న ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  ఈ తొలి హై-స్పీడ్ బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల వేగంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక కీలకమైన సమాచారాన్ని పంచుకున్నారు.

508 కిలోమీటర్ల ట్రాక్‌:

భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలుకు సంబంధించి మరో కీలకమైన అప్‌డేట్‌ను అందించాయి. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్విట్టర్ (ప్రస్తుతం X) అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో పంచుకున్నారు. 508 కిలోమీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ ఇప్పుడు రూపుదిద్దుకుంటోందని, దాని పూర్తి పనులు వేగంగా పురోగమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: House Construction: 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణంలో కేవలం స్లాబ్‌ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? పూర్తి లెక్కలివే..!

వేగంగా విద్యుదీకరణ పనులు:

గుజరాత్‌లోని నవసారిలో బుల్లెట్ రైలు మార్గంలో జరుగుతున్న పనులకు సంబంధించిన ఒక వీడియోను రైల్వే మంత్రి తన పోస్ట్‌లో పంచుకున్నారు. ట్రాక్‌పై విద్యుదీకరణ పనులు వేగంగా పురోగమిస్తున్నాయని, ఇది మొత్తం ప్రాజెక్ట్‌లో ఒక ప్రధాన ముందడుగు అని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. నవసారి సమీపంలోని హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ఇంజనీర్లు, కార్మికులు విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

ఏ పనులు, ఎలా జరుగుతున్నాయి?

రైల్వే మంత్రి తన పోస్ట్‌లో పంచుకున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులు 1,125 కిలోమీటర్ల ట్రాక్‌పై కొనసాగుతున్నాయి. ఈ పనులలో భాగంగా, ట్రాక్‌పై ఉన్న విద్యుత్ తీగలకు ఆధారం ఇచ్చేందుకు 22,000 ఓవర్‌హెడ్ హెడ్ మాస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఓవర్‌హెడ్ వైర్ వ్యవస్థకు అత్యవసరమైన 25,700 కాంటిలివర్ అసెంబ్లీలను బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో అమర్చుతున్నారు.

ఇవి కూడా చదవండి: SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌!

బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో..

ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ఈ ట్రాక్‌పై గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనివల్ల ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ప్రస్తుతం అత్యంత వేగవంతమైన రైళ్లను ఉపయోగించి ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. ఈ ఆరు గంటల ప్రయాణాన్ని బుల్లెట్ రైలును ఉపయోగించి కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేయవచ్చు.

బుల్లెట్ రైలు 12 స్టేషన్లలో ఆగుతుంది:

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌కు సంబంధించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ హై-స్పీడ్ రైలు కోసం 12 స్టాప్‌లను ఖరారు చేశారు. నివేదికల ప్రకారం, ఈ బుల్లెట్ రైలు కారిడార్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీల గుండా వెళుతుంది. స్టాప్‌లను ఖరారు చేసిన 12 ప్రధాన స్టేషన్లలో ముంబై (బీకేసీ), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి ఉన్నాయి.

 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Loading...
Unable to load recommendations.
Follow Us