
Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైలు టికెట్ బుక్ చేసుకున్నాక అది కన్ఫర్మ్ అవుతుందో లేదో అని టెన్షన్ పడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు రైల్వే శాఖ ప్రవేశపెట్టిన RailOne మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోకముందే అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Silver Price: దిమ్మదిరిగే షాకిచ్చిన సిల్వర్ ధర.. రూ.55 వేలు పెరిగిన వెండి.. ప్రస్తుతం ఎంతంటే..!
రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ‘RailConnect’, ‘UTS’ వంటి పాత యాప్ల స్థానంలో RailOne అనే సూపర్ యాప్ను లాంచ్ చేసింది. ఈ యాప్లో ఉన్న ప్రధాన ఫీచర్ ఏంటంటే.. మీరు వెయిటింగ్ లిస్ట్ ఉన్న టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు అది కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విశ్లేషించి చెబుతుంది.
గతంలో ఈ అంచనా ఖచ్చితత్వం 53 శాతంగా ఉండగా, ఇప్పుడు దాన్ని 94 శాతానికి పెంచారు. దీనివల్ల ప్రయాణికులు అనవసరంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకుని ఇబ్బంది పడకుండా, ప్రత్యామ్నాయ రైళ్లను చూసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Vande Bharat: రూ.750 టికెట్ రూ.380కే.. వందే భారత్ రైల్లో బంపర్ ఆఫర్.. కట్ చేస్తే
కేవలం టికెట్ కన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా, ఈ సూపర్ యాప్ ఒకే ప్లాట్ఫారమ్పై అనేక సేవలను అందిస్తోంది.
Railone
ఇది కూడా చదవండి: Amul Milk: సామాన్యుడికి మరో షాక్.. దేశవ్యాప్తంగా పెరగనున్న అమూల్ పాల ధరలు.. రేపటి నుంచే అమలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి