Indian Railways: కేంద్రం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపు రేఖలు!

Indian Railways Plans: రానున్న రోజుల్లో హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్‌లు సహా దేశంలో 48 ప్రధాన నగరాల స్టేషన్‌ల రూపు రేఖలు మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధిలో భాగంగా రైళ్ల రెట్టింపు సామర్థ్యాన్ని పెంచబోతోంది. ఇప్పటికే ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం..

Indian Railways: కేంద్రం కీలక నిర్ణయం.. హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపు రేఖలు!
Indian Railways Plans

Updated on: Dec 27, 2025 | 8:49 PM

Indian Railways Plans: దేశంలో రైలు ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత రైల్వే ఒక ప్రధాన ప్రణాళికను ప్రారంభించింది. రాబోయే సంవత్సరాల్లో ప్రయాణికుల సంఖ్య వేగంగా పెరుగుతుందని, ఈ డిమాండ్‌ను నిర్వహించడానికి ప్రధాన నగరాల నుండి నడిచే రైళ్ల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. 2030 నాటికి 48 ప్రధాన నగరాల్లో రైళ్ల ప్రారంభ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనిని సాధించడానికి ఇప్పటికే ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతోపాటు, భవిష్యత్ అవసరాలను సకాలంలో తీర్చడానికి కొత్త టెర్మినల్స్, సౌకర్యాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది.

ఇది కూడా చదవండి: Mega Bank Merger Plan: ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఇవి కూడా చదవండి

స్టేషన్లు, టెర్మినల్స్ విస్తరణ:

మంత్రిత్వ శాఖ ప్రకారం.. ప్రస్తుత టెర్మినల్స్‌కు కొత్త ప్లాట్‌ఫామ్‌లను జోడించడం ఈ ప్రణాళికలో ఉంటుంది. అదనంగా ఒకే స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించడానికి నగరాల చుట్టూ కొత్త టెర్మినల్స్ అభివృద్ధి చేయనున్నారు. ఉదాహరణకు పూణేలో ప్రధాన స్టేషన్‌తో పాటు, సామర్థ్యాన్ని పెంచడానికి హడప్సర్, ఖడ్కి, అలండి వంటి స్టేషన్లను చేర్చారు.

కోచింగ్ సౌకర్యాలపై ప్రాధాన్యత:

రైల్వేలు రైళ్ల సంఖ్యను పెంచడమే కాకుండా వాటి నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఈ లక్ష్యంతో మెగా కోచింగ్ కాంప్లెక్స్‌లు, కొత్త నిర్వహణ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా ట్రాఫిక్ సంబంధిత పనుల ద్వారా సెక్షన్ సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుంది. ఇది అంతరాయం లేని రైలు కార్యకలాపాలను నిర్ధారిస్తుంది. ఈ ప్రణాళికను దశలవారీగా అమలు చేస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పనులు తక్షణ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక అనే మూడు వర్గాలుగా విభజించారు. సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించేందుకు కేంద్రం 2030 లక్ష్యంగా పెట్టుకుంది.

48 నగరాలపై ప్రత్యేక దృష్టి:

ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, పూణే, మధుర, ఆగ్రా, లూథియానా వంటి ప్రధాన నగరాలకు ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. టెర్మినల్స్ వద్ద మాత్రమే కాకుండా మొత్తం డివిజన్ అంతటా రైలు సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తామని, కార్యాచరణ అడ్డంకులను తొలగించడంపై దృష్టి సారిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి: Electric Scooter: కేవలం రూ.15 వేలు చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకెళ్లండి.. రూ.22,500 డిస్కౌంట్‌.. ఈనెల 31 వరకే ఛాన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి