AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఈ ప్రత్యేక రైల్వే సౌకర్యం గురించి మీకు తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే నియమాల ప్రకారం.. ప్రయాణికులు తమ టిక్కెట్ తరగతికి సంబంధించిన కోచ్‌లోనే ప్రయాణించాలి. టిటిఇ మీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేసే వరకు మీరు మీ కోచ్‌లోనే ఉండాలి. టిటిఈ స్లీపర్, ఏసీ మధ్య ఉన్న ఛార్జీని వసూలు..

Indian Railways: స్లీపర్ టికెట్‌తో ఏసీ కోచ్‌లో ప్రయాణం.. ఈ ప్రత్యేక రైల్వే సౌకర్యం గురించి మీకు తెలుసా?
Indian Railways Rules
Subhash Goud
|

Updated on: May 30, 2026 | 5:58 PM

Share

Indian Railways: ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైలులో ముఖ్యంగా స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించడం నిజంగా ఒక సవాలు. అయితే స్లీపర్ క్లాస్ టిక్కెట్‌తో ఏసీలో ప్రయాణించే అవకాశాన్ని రైల్వే మీకు అందిస్తోందని చెబితే మీరు నమ్మలేకపోవచ్చు. ఇది అక్షరాలా నిజం. మీరు కొన్ని అర్హతలను కలిగి ఉంటే ఈ రైల్వే సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ మండుటెండలో రైలు ప్రయాణికులకు ఈ సౌకర్యం ఒక పెద్ద ఊరట. ప్రస్తుతం వేసవి సెలవులు కూడా కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది ప్రయాణాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

అయితే, ఏసీ క్లాస్ రైలు టిక్కెట్టు దొరకనప్పుడు సమస్య తలెత్తుతుంది. ముఖ్యంగా వేసవిలో ఏసీ క్లాస్ టిక్కెట్లు త్వరగా అమ్ముడైపోతాయి. అలాగే కుటుంబంతో స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించడం చాలా కష్టం. స్లీపర్ క్లాస్ టిక్కెట్టుతో ఏసీ సీట్లు లభిస్తాయా లేదా అనేదే మనసులో మెదిలే ఏకైక ప్రశ్న. ఈ విషయానికి సంబంధించి రైల్వే అధికారులు కొన్ని అనుకూలమైన నిబంధనలను పేర్కొన్నారు.

షరతులకు లోబడి మీరు ఏసీలో ప్రయాణించవచ్చు:

మీ వద్ద స్లీపర్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ, మీరు ఏసీలో ప్రయాణించవచ్చని ఒక రైల్వే అధికారి వివరించారు. దీని కోసం మీరు టీటీఈతో మాట్లాడవచ్చు. కానీ ఖాళీ సీట్లు ఉంటేనే మీకు ఏసీ సీటు కేటాయిస్తారు. ఏసీ కోచ్‌లో ఖాళీ సీట్లు ఉంటే టీటీఈ మీ టికెట్‌ను అప్‌గ్రేడ్ చేయగలరు. అలాగే ఛార్జీలలోని వ్యత్యాసాన్ని చెల్లించిన తర్వాత మీరు స్లీపర్ క్లాస్ నుండి ఏసీకి ప్రయాణించడానికి అర్హత పొందవచ్చు. అయితే, ఏసీ కోచ్ అప్పటికే నిండిపోయి ఉంటే మీరు మీ టికెట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోలేరు. ఉదాహరణకు స్లీపర్ క్లాస్ ఛార్జీ రూ.400, ఏసీ ఛార్జీ రూ.1,200 అయితే, మీ టికెట్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీరు వ్యత్యాసం అంటే రూ.800 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: RBI: పెద్ద నోట్ల రద్దు తర్వాత 10 ఏళ్లకు ఆర్బీఐ మరో కీలక మార్పుకు సన్నాహాలు

అడగకుండా ఎక్కితే ఏమవుతుంది?

ఒక రైల్వే అధికారి వివరించిన దాని ప్రకారం, టీటీఈ మీ టిక్కెట్టును అప్‌గ్రేడ్ చేసి మిమ్మల్ని ఏసీ కోచ్ ఎక్కడానికి అనుమతించినప్పటికీ, మీరు టీటీఈని సంప్రదించకుండా ఏసీ కోచ్‌లో ప్రయాణించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవచ్చు. అటువంటి సందర్భంలో టీటీఈ ప్రయాణికుడి నుండి ఛార్జీల వ్యత్యాసాన్ని వసూలు చేయడమే కాకుండా, జరిమానా కూడా విధించవచ్చు. అయితే, ప్రయాణికుడు కోచ్ ఎక్కడానికి సరైన కారణం చూపిస్తే, జరిమానా విధించకుండా వారిని తర్వాతి స్టేషన్‌లో స్లీపర్ కోచ్‌కి వెనక్కి పంపవచ్చు.

రైల్వే నియమం ఏమి చెబుతోంది?

భారతీయ రైల్వే నియమాల ప్రకారం.. ప్రయాణికులు తమ టిక్కెట్ తరగతికి సంబంధించిన కోచ్‌లోనే ప్రయాణించాలి. టిటిఇ మీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేసే వరకు మీరు మీ కోచ్‌లోనే ఉండాలి. టిటిఈ స్లీపర్, ఏసీ మధ్య ఉన్న ఛార్జీని వసూలు చేసి, మీ టిక్కెట్‌ను అప్‌గ్రేడ్ చేసిన తర్వాత మాత్రమే మీరు మీ కోచ్ నుండి ఏసీకి మారవచ్చు. రైల్వే నియమాల ప్రకారం.. టీటీఈ అనుమతి లేకుండా అలా చేస్తే, అదనపు ఛార్జీతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే ఏమవుతుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us