Indian Railways: ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!

Indian Railways: మీరు రైలులో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నా, మీ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో తగినంత డబ్బు లేకపోతే, ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే 'బుక్ నౌ, పే లేటర్' అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది..

Indian Railways: ఇప్పుడు ప్రయాణించండి.. తర్వాత చెల్లించండి.. రైల్వే కొత్త పథకం!

Updated on: Jan 27, 2025 | 6:00 AM

భారత రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువవచ్చింది. రైలు ప్రయాణాన్ని సాఫీగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు రైల్వేశాఖ రోజురోజుకూ అడుగులు వేస్తోంది. రైల్వేశాఖ తాజాగా మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ప్రయాణికులు సులభతరంగా ప్రయాణించవచ్చు. ఈ కొత్త పథకం గురించి తెలుసుకుందాం.

మీరు రైలులో ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్నా, మీ టిక్కెట్‌ను బుక్ చేసుకునే సమయంలో తగినంత డబ్బు లేకపోతే, ఇప్పుడు మీరు చింతించాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే ‘బుక్ నౌ, పే లేటర్’ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.

సకాలంలో చెల్లిస్తే అదనపు ఛార్జీలు ఉండవు

ఇవి కూడా చదవండి

ఈ పథకం కింద మీరు ఎలాంటి చెల్లింపులు చేయకుండానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. 14 రోజులలోపు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు. సకాలంలో చెల్లించినట్లయితే అదనపు ఛార్జీలు వసూలు చేయరు. అయితే ఆలస్యమైతే 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాలి.

‘పే లెటర్’ పథకం ప్రయోజనాన్ని ఎలా పొందాలి?

ఈ పథకాన్ని పొందేందుకు మీరు ముందుగా మీ IRCTC ఖాతాకు లాగిన్ చేయాలి. తర్వాత ‘బుక్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, ప్రయాణికుల వివరాలను నింపి సమర్పించండి. దీని తర్వాత చెల్లింపు పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా BHIM యాప్ ద్వారా చెల్లించే ఎంపికను పొందుతారు.

మీరు ‘పే లేటర్’ ఆప్షన్‌ని ఉపయోగించాలనుకుంటే, ముందుగా epaylater.inకి వెళ్లి రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు చెల్లింపు ఎంపికను పొందుతారు. మీరు ముందస్తు చెల్లింపు లేకుండా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

14 రోజుల్లోగా చెల్లింపు చేయాలి

టికెట్ బుకింగ్ చేసిన 14 రోజులలోపు చెల్లించాలని గుర్తుంచుకోండి. సకాలంలో చెల్లింపు చేస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయరు. కానీ చెల్లింపు ఆలస్యం అయితే 3.5 శాతం సర్వీస్ ఛార్జీ విధిస్తారు.

అసలు ఈ పథకం ఎవరి కోసం రూపొందించారు?

అకస్మాత్తుగా ప్రయాణించాలని నిర్ణయించుకునే ప్రయాణికులకు ఈ పథకం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ తక్షణ టికెట్ కోసం డబ్బు లేదు. ఈ కొత్త పథకంతో భారతీయ రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, అనువైనదిగా మార్చింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us