ప్రస్తుతం దేశంలో దీపావళి హడావుడి నెలకొంది. భారతీయ సంస్కృతిలో పండుగ సీజన్లో ఆహారం స్వీట్లకు ప్రత్యేక స్థానం ఉంది. కుటుంబం, స్నేహితులతో పంచుకోవడానికి ప్రతి ఇంటిలో రుచికరమైన స్వీట్లను తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తయారు చేసే స్వీట్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే భారతదేశానికి దూరంగా విదేశాల్లో నివసిస్తున్న వారికి ఇండియన్ పోస్ట్స్ మంచి వార్త చెప్పింది. సరికొత్త సేవలతో ఎప్పుడూ ప్రజాదరణ పొందే ఇండియన్స్ పోసట్స్ ఇంట్లో తయారు చేసిన దీపావళి స్వీట్లను 126 దేశాలకు సరసమైన ధరలకు పంపుతామని స్పష్టం చేసింది.
ఇంటి రుచులను కోరుకునే వారికి తాజాగా, సురక్షితంగా డెలివరీ సర్వీసులు అందిస్తామని స్పష్టం చేసింది. కేజీ నుంచి 35 కేజీల వరకు స్వీట్లను రవాణా చేసే అవకాశాన్ని ఇండియన్ పోస్ట్స్ అందిస్తుంది. ప్రైవేట్ కొరియర్లతో చాలా తక్కువ ధరల్లోనే ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ 10-15 బుకింగ్లు జరుగుతున్నాయని భవిష్యత్లో మరిన్ని బుకింగ్స్ వస్తాయని ఇండియన్ పోస్ట్స్ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి