
భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా చాలా కాలంగా నెలకొన్న గందరగోళానికి ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కలిసి తెరదించారు. తాజాగా ఈ రెండు దేశాల మధ్య కీలకమైన ట్రేడ్ డీల్ సెట్ అయింది. ఈ డీల్తో భారత్పై 50 శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించింది అమెరికా. ఇకపై అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులు అతి తక్కువ టారిఫ్తో అమెరికాలోకి ప్రవేశించనున్నాయి.
భారతీయ వస్తువులపై అమెరికా 25 శాతం టారిఫ్లు విధించేది, అలాగే రష్య నుంచి ముడి చమురు కొనుగోలుపై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇప్పుడు కొత్త ఒప్పందంతో సాధారణ దిగుమతి సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించి, 25 శాతం ఉన్న అదనపు సుంకాలను పూర్తిగా తొలగించారు.
అయితే ఈ కొత్త సుంకాలతో ఇతర ఎగుమతి పోటీదారులతో పోల్చుకుంటే భారత్ అతి తక్కువ సుంకాలతో అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయనుంది. చైనా, పాకిస్థాన్, ఇండోనేషియా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు సైతం భారత్ కంటే ఎక్కువ సుంకాలు కడుతున్నాయి. ఆగ్నేయాసియాలో ఉన్న ఎగుమతి పోటీదారులతో పోల్చుకుంటే భారత్పై అతి తక్కువ సుంకాలు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి