డీహెచ్‌ఎల్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఇండియన్ పోస్ట్.. మరిన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్ సేవలను పెంచే దిశగా..

|

Mar 16, 2021 | 8:00 PM

India Post in Talks for DHL : అన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్‌ను అందించాలనే ఉద్ధేశ్యంతో ఇండియా పోస్ట్.. గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థ డిహెచ్‌ఎల్‌తో చేయి

డీహెచ్‌ఎల్‌తో సంప్రదింపులు జరుపుతున్న ఇండియన్ పోస్ట్.. మరిన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్ సేవలను పెంచే దిశగా..
India Post In Talks For Dhl
Follow us on

India Post in Talks for DHL : అన్ని దేశాలకు స్పీడ్ పోస్ట్‌ను అందించాలనే ఉద్ధేశ్యంతో ఇండియా పోస్ట్.. గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థ డిహెచ్‌ఎల్‌తో చేయి కలపడానికి చర్చలు జరుపుతోంది. స్పీడ్ పోస్ట్ ద్వారా మరింత ఆదాయాన్ని సాధించడానికి DHL తో జతకడుతున్నట్లు పోస్టల్ శాఖ కార్యదర్శి ప్రదీప్తా కుమార్ బిసోయి ఒక ప్రకటనలో తెలిపారు. వారితో చర్చలు చివరి దశలో ఉన్నాయని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇండియన్ పోస్ట్ ప్రస్తుతం 100 దేశాలకు స్పీడ్ పోస్ట్‌ను పంపిణీ చేస్తోందని.. DHLతో జత కట్టడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తమ సేవలను విస్తారిస్తామని వెల్లడించారు.

COVID-19 ప్రభావం కారణంగా డిసెంబర్ వరకు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా పోస్ట్ మొత్తం ఆదాయం రూ.1,002.75 కోట్లకు తగ్గిందన్నారు. ఈ మొత్తం రూ. 2019-20 తులనాత్మక కాలంలో రూ. 1,764 కోట్లు, 2018-19లో 9 రూ.1,922 కోట్లు, 2017-18లో రూ.81,829.80, 2016-17లో రూ.78 1,783 కోట్లుగా నమోదైందన్నారు. ఇక ఈ పొత్తు వల్ల వినియోగదారులకు ట్రాకింగ్ సేవలు కూడా సులభతరం అవుతాయని పేర్కొన్నారు. ఎందుకంటే DHL ప్రత్యక్ష ట్రాకింగ్‌ను అందించగలదని, తాము తపాలాను బుక్ చేసి వారికి ఈ సేవలను కల్పిస్తామని చెప్పారు.

ప్రస్తుతం బ్యాంకింగ్ సంబంధిత సేవల నుంచి ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న ఈ విభాగం, పెద్ద నగరాల్లో ఇ-కామర్స్ డెలివరీల కోసం ప్రైవేట్ ఆటగాళ్లతో పోటీ పడటానికి కూడా కృషి చేస్తోందన్నారు. 2020-21 వార్షిక నివేదిక ప్రకారం, దేశీయ కొరియర్, ఎక్స్‌ప్రెస్ మరియు పార్శిల్ రంగంలో 2024 నాటికి 10% రెవెన్యూ మార్కెట్ వాటాను సాధించాలని ఇండియా పోస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

కరోనా సమయంలో చాలా వరకు ఆదాయాన్ని నష్టపోయినప్పటికీ ఇప్పడిప్పుడే కోలుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ సమయంలో రైలు, విమాన సేవలను నిలిపివేసినప్పటికి రోడ్డు రవాణా నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన వస్తువులను, ముఖ్యంగా వెంటిలేటర్లు, మందులు, పరీక్షా వస్తు సామగ్రి మొదలైన వాటిని దేశవ్యాప్తంగా రోడ్డు మార్గం ద్వారా అందించామని వెల్లడించారు.

India vs England 3rd T20 Live: నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. పట్టుబిగించిన ఇంగ్లాండ్..

ఫ్లోరిడాలో కారుపైకి దూసుకు వెళ్లిన సింగిల్ ఇంజన్ విమానం, ఇద్దరి మృతి, వాహనంలోని తల్లీ బిడ్డలకు తీవ్ర గాయాలు వీడియో