ఇటీవల కాలంలో జీవిత బీమా పథకాలను ప్రజలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత కాలంలో దీనికి ప్రాధాన్యం పెరిగింది. అకస్మాత్తుగా అనుకోని సంఘటనల నడుమ వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఈ బీమా పథకాలు ఉపయోగపడుతున్నాయి. ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు అనేక ప్రైవేటు సంస్థలు కూడా విభిన్న రకాల ప్రయోజనాలు, ప్రీమియంలతో పాలసీలు అందిస్తున్నాయి. అటువంటి సంస్థల్లో ప్రముఖ ప్రైవేటు సంస్థ, ప్రజల ఆదరణ పొందిన సంస్థ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్(ఏబీఎస్ఎల్ఐ). దీనిలో అనేక రకాల స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల మరో పథకానికి ఏబీఎస్ఎల్ఐ శ్రీకారం చుట్టింది. అది కేవలం ఉద్యోగులకు మాత్రమే ఉద్దేశించిన పథకం. ఈ పాలసీ పేరు ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టెర్మ్ ప్లాన్. ఇది బడ్జెట్ పరిధిలోనే ఉండే స్నేహపూర్వక ప్లాన్. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, లైఫ్ ఇండివిజువల్, ప్యూర్ రిస్క్, ప్రీమియం ప్లాన్. జీతం పొందే నిపుణులకు వారి వ్యక్తిగత రక్షణ అవసరాలకు అనుగుణంగా ప్లాన్లను రూపొందించుకునే స్వేచ్ఛను అందిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ సందర్భంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎండీ అండ్ సీఈఓ కమలేష్ రావు మాట్లాడుతూ, ఏబీఎస్ఎల్ఐ శాలరీడ్ టర్మ్ ప్లాన్ను ప్రవేశపెట్టడం ద్వారా, జీతం పొందే వ్యక్తులు వారి రక్షణ అవసరాలను తీర్చుతామని చెప్పారు. ఈ ప్రత్యేకమైన టర్మ్ ప్లాన్ తమ కస్టమర్లకు అనుకూలీకరించిన రక్షణ పరిష్కారాన్ని అందించడంలో తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందన్నారు. అంతేకాక భారతదేశంలోని జీతం పొందే నిపుణుల ఆకాంక్షలు, ఆర్థిక భవిష్యత్తును కాపాడడంలో నమ్మకమైన భాగస్వామిగా తమ సంస్థ అవతరిస్తుందని పేర్కొన్నారు.
అదనపు రక్షణ కోసం, పాలసీదారులకు అనేక రైడర్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ప్లస్/ ఏబీఎస్ఎల్ఐ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్నెస్ రైడర్, హాస్పిటల్ కేర్ రైడర్ అండ్ ప్రీమియం రైడర్ మాఫీ వంటివి ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..