మన దేశంలో అనేక రకాల కంపెనీలు, విభిన్న రకాల పథకాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) అంటేనే జనాలకు బాగా నమ్మకం. అన్ని రంగాల ప్రజలకు అవసరమైన ప్లాన్లను ఇందులో అందుబాటులో ఉండటం.. కేంద్ర ప్రభుత్వం భరోసా కూడా లభిస్తుండటంతో అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడతారు. జీవిత బీమాతో పాటు అనేక రకాల ప్లాన్లు ఇక్కడ ఉన్నాయి. అలాంటి పథకాల్లో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ ఒకటి. దీనిని ఎల్ఐసీ 2022 ఆగస్టులో ప్రారంభించింది. ఇన్ స్టంట్ యాన్యుటీ ప్లాన్. అంతేకాక నాన్-లింక్డ్ నాన్-పార్టిసిపేటింగ్ అప్ఫ్రంట్ సింగిల్ ప్రీమియం పథకం. ఈ ప్లాన్ ప్రారంభం నుంచి దాదాపు 5 శాతం యాన్యుటీ రేటు హామీ అందిస్తుంది. దీనిలో నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షిక చెల్లింపును ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ సరళ్ పెన్షన్ ప్లాన్ అర్హతలు.. రాబడి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరైనా ఈ యాన్యుటీ పెన్షన్ స్కీమ్ను సబ్స్క్రైబ్ చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి అర్హులు.
ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సరళ్ పెన్షన్ ప్లాన్ వివరాల ప్రకారం, పాలసీదారు ఈ పథకం కింద కనీసం రూ.1,000 నెలవారీ పెన్షన్ లేదా రూ. 12,000 వార్షిక పెన్షన్ను ఎంచుకోవచ్చు. ఈ కనీస పెన్షన్ కోసం, ఒకరు రూ.2.50 లక్షలను ఒకేసారి సింగిల్ ప్రీమియం చెల్లించాలి . ఒక పెట్టుబడిదారు రూ.10 లక్షల సింగిల్ ప్రీమియం పెట్టుబడిపై రూ. 50,250 వార్షిక పెన్షన్ పొందుతారు . అదేవిధంగా, పెట్టుబడిదారుడు ఈ పథకం కింద రూ.1 లక్ష వార్షిక పెన్షన్ కావాలనుకుంటే, రూ. 20 లక్షల ప్రీమియం చెల్లింపును ముందస్తుగా చెల్లించాలి .
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..