AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahila Samman Savings Certificate: మహిళలకు వరం ఈ పథకం.. భద్రత, భరోసాతో పాటు అధిక రాబడి.. పూర్తి వివరాలు ఇవి..

మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్కీమ్ మహిళా స్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎంఎస్ఎస్సీ). మహిళలను పొదుపు వైపు మళ్లించి, వారి సాధికరతను లక్ష్యంగా పెట్టుకొని యూనియన్ బడ్జెట్ 2023-24లో ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. 2023 ఏప్రిల్ 1 ఈ స్కీమ్ ప్రారంభమైంది. మార్చి 2025 వరకూ దీనిలో పెట్టుబడులు పెట్టుకొనే అవకాశం ఉంది.

Mahila Samman Savings Certificate: మహిళలకు వరం ఈ పథకం.. భద్రత, భరోసాతో పాటు అధిక రాబడి.. పూర్తి వివరాలు ఇవి..
Cash
Madhu
|

Updated on: Oct 27, 2023 | 5:01 PM

Share

మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్కీమ్ మహిళా స్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్(ఎంఎస్ఎస్సీ). మహిళలను పొదుపు వైపు మళ్లించి, వారి సాధికరతను లక్ష్యంగా పెట్టుకొని యూనియన్ బడ్జెట్ 2023-24లో ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. 2023 ఏప్రిల్ 1 ఈ స్కీమ్ ప్రారంభమైంది. మార్చి 2025 వరకూ దీనిలో పెట్టుబడులు పెట్టుకొనే అవకాశం ఉంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, భాగస్వామ్య ప్రైవేటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో మహిళలు ఈ ఎంఎస్ఎస్సీ ఖాతాను ప్రారంభించవచ్చు. ఎవరైనా మహిళలు లేదా మైనర్ బాలిక అయితే చట్టబద్ధమైన సంరక్షకుని పేరు మీద ఖతాను తెరవచ్చు. ఈ స్కీమ్ ప్రస్తుతం చాలా బ్యాంకులు అందిస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), రెండు సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టెర్మ్ డిపాజిట్ కంటే మెరుగైన రాబడిని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం అర్హతలు, రాబడి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ప్రధాన ఫీచర్లు ఇవి..

  • సమయం.. ఎంఎస్ఎస్సీలో ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2025 మధ్య ఖాతా ప్రారంభించి, పెట్టుబడి పెట్టొచ్చు.
  • పెట్టుబడి పరిమితులు.. మీరు ఎంఎస్ఎస్సీ పథకంలో కేవలం రూ. 1,000తో పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆ తర్వాత రూ. 100 గుణిజాల్లో గరిష్ట పరిమితి అయిన రూ.2 లక్షల వరకూ ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. ఒకేసారి రెండు లక్షలైనా చేయొచ్చు.
  • కాల వ్యవధి, వడ్డీ రేటు.. ఎంఎస్ఎస్సీలో పెట్టుబడి కాలవ్యవధి రెండు సంవత్సరాలు. ప్రస్తుతం, ఈ పథకంలో సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది త్రైమాసికానికి కలిపి, మెచ్యూరిటీ తర్వాత చెల్లించబడుతుంది.
  • పాక్షిక ఉపసంహరణ.. ఒక సంవత్సరం పెట్టుబడి తర్వాత మీరు బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు.
  • అకాల మూసివేత.. మెచ్యూరిటీకి ముందు ఖాతాదారుడు మరణించిన సందర్భంలో లేదా సంరక్షకుని మరణం, ప్రాణాంతక వ్యాధులు లేదా ఇతర తీవ్రమైన కారణాల వంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఎటువంటి జరిమానా లేకుండా ఖాతాను మూసివేయడానికి అనుమతిస్తారు. అలాగే మీరు ఎటువంటి కారణం లేకుండా ఆరు నెలల తర్వాత ఖాతాను మూసివేయవచ్చు, కానీ వడ్డీ రేటు 5.5 శాతానికి తగ్గించి ఇస్తారు.
  • పన్ను విధింపు.. ప్రస్తుతానికి ఈ విషయంపై కాస్త అనిశ్చితి ఉంది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద ఏదైనా ప్రత్యేక పన్ను ప్రయోజనాలు ఉంటాయా అనేది స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.

రూ. 2 లక్షలు పెట్టుబడి ఎంత వస్తుంది..

ఎంఎస్ఎస్సీ పథకంలో వడ్డీ రాబడి ప్రధాన త్రైమాసికంతో లెక్కించబడుతుంది. ఉదాహరణకు, మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, మొదటి త్రైమాసికానికి వడ్డీ రూ. 3,750 అవుతుంది. రెండో త్రైమాసికం తర్వాత, అసలు మొత్తం, సంపాదించిన వడ్డీతో సహా మొత్తం మొత్తంపై వడ్డీ లెక్కించబడుతుంది. ఈ ప్రక్రియ ప్రతి త్రైమాసికంలో పునరావృతమవుతుంది, ఫలితంగా రెండేళ్ల వ్యవధి ముగిసే సమయానికి మెచ్యూరిటీ విలువ రూ. 2.32 లక్షలు.

ఎలా పెట్టుబడి పెట్టాలి?

ఎంఎస్ఎస్సీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కాపీని సమీపంలోని పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకుకు తీసుకెళ్లండి, డిపాజిట్ మొత్తం చెక్కును పూరించండి. ఖాతా ప్రారంభ ఫారమ్ కోసం అడగండి. అవసరమైన పత్రాలతో పాటు ఫారమ్‌ను సమర్పించి, మొత్తాన్ని డిపాజిట్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..