
2016లో చేసిన నోట్ల రద్దు నుంచి భారతదేశంలో ప్రజలు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశ ప్రభుత్వం ఎన్పీసీఐ ద్వారా తీసుకువచ్చి యూపీఐ సేవలు ప్రజలను మరింత ఆకట్టుకున్నాయి. యూపీఐ పని చేసేలా చాలా పేమెంట్ యాప్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యూపీఐ సేవలను మరింత విస్తృతం చేసేందుకు క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను పరిచయం చేశారు. అయితే ఈ సేవలను కేవలం రూపే క్రెడిట్ కార్డులకు పరిమతం చేశారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకుల కస్టమర్లు రూపే క్రెడిట్ కార్డ్లతో యూపీఐ లావాదేవీల సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ని యూపీఐ యాప్కి లింక్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం బీమ్ యాప్లో అందుబాటులో ఉంది. రూపే క్రెడిట్ కార్డ్లను బీమ్ యాప్కి కనెక్ట్ చేయడం ద్వారా కస్టమర్లు మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు.
బీమ్ యాప్ 11 బ్యాంకుల నుండి రూపే క్రెడిట్ కార్డ్లను లింక్ చేయడానికి అనుమతిస్తుంది. బ్యాంక్ ఖాతాతో చెల్లింపులు చేయడం లాగానే ఇప్పుడు యూపీఐ చెల్లింపులు చేయడానికి వారి రూపే క్రెడిట్ కార్డ్ని ఉపయోగించవచ్చు, పీర్-టు-పీర్ లావాదేవీల వంటి నిర్దిష్ట చెల్లింపు రకాలను ఈ కొత్త సేవను ఉపయోగించి చేయడం సాధ్యం కాదని గమనించడం ముఖ్యం. అయితే బీమ్ యాప్తో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల నుంచి రూపే క్రెడిట్ కార్డ్లు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే, పేజాప్, ఫ్రీచార్జ్ ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం