Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold and Silver Latest Prices: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం (సెప్టెంబర్‌ 29) కూడా బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 గా ఉంది..

Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: Sep 29, 2023 | 6:36 AM

Gold and Silver Latest Prices: బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం (సెప్టెంబర్‌ 29) కూడా బంగారం ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,500 గా ఉంది. పది గ్రాముల బంగారంపై రూ.600 నుంచి 650 రూపాయల మేర ధర తగ్గింది. ఇక వెండి కూడా బంగారం ధరలనే అనుసరించాయి. కిలో వెండిపై రూ.500 మేర తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.73,700 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే ధరలు అమలవుతున్నాయి. మరి శుక్రవారం పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.53,900 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.58,800 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ నగరాల్లోనూ ఇదే ధరలు అమలవుతున్నాయి.

ఇతర  ప్రధాన నగరాల్లో..

ఇక ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.54,050 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,950 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.53,900, 24 క్యారెట్ల పసిడి రూ.58,950, చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,100, 24 క్యారెట్ల ధర రూ.59,020 గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.53,900, 24 క్యారెట్లు రూ.58,800, బెంగళూరులో 22 క్యారెట్ల రేటు రూ.53,900, 24 క్యారెట్ల ధర రూ.58,800, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.53,900, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,800 గా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలిలా..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.73,700గా ఉండగా.. ముంబైలోనూ ఇదే ధర పలుకుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500, బెంగళూరులో రూ.73,000, కేరళలో రూ.76,500, కోల్‌కతాలో రూ.73,700 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర రూ.76,500 పలుకుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇదే ధరకు లభిస్తోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..