పసిడి ప్రియులకు బాగా కలిసొచ్చిన ఉగాది..! ఘోరంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే

ప్రస్తుతం పసిడి ప్రేమికులకు ఇది శుభవార్త అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు, మార్చి 20 నాటికి భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నెల ప్రారంభంతో పోలిస్తే ధరలు దాదాపు 9.77శాతం మేర పడిపోయాయి. నేటి (మార్చి 20, 2026) తాజా ధరలు, తగ్గుదలకు గల కారణాలు కింద ఉన్నాయి.

పసిడి ప్రియులకు బాగా కలిసొచ్చిన ఉగాది..! ఘోరంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
Gold And Silver Price Today

Updated on: Mar 20, 2026 | 7:16 AM

గోల్డ్‌ లవర్స్‌కి సూపర్‌ గుడ్‌న్యూస్‌.. నేడు మార్చి 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి. దీంతో పసిడి ప్రియులకు ఈ ఉగాది బాగా కలిసొచ్చిందని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగానే తగ్గాయి. గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ధర, ఒక రోజు క్రితం రోజు స్వల్పంగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మళ్లీ ధరలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ, ఒక్కరోజులోనే యూటర్న్ తీసుకున్నాయి. ఒకేరోజున అమాంతంగా కుప్పకూలిపోయాయి.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,50,270లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,37,740లకు చేరింది. తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,630 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,38,990 గా ఉంది.

అటు ఆర్థిక రాజధాని ముంబైలోనూ పసిడి ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,420, 22 క్యారెట్ల ధర రూ.1,37,890లు గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర భారీగానే దిగి వచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 గా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలోనూ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,50,270, 22 క్యారెట్ల ధర రూ.1,37,740 లకు చేరింది.

ఇక వెండి విషయానికి వస్తే, భారతదేశంలో వెండి ధరలు నగరాల వారీగా మారుతూ ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో (హైదరాబాద్, చెన్నై) వెండి ధర ఉత్తరాది నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. భారతదేశ బులియన్‌ మార్కెట్లో నేటి వెండి ధర గ్రాము రూ.264.90 లు ఉండగా, కిలో రూ.2,64,900.లకు దిగి వచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలలోపు అందిన సమాచారం మేరకు మాత్రమే. ధరలు ప్రతి క్షణం మారవచ్చు.

ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us