AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం భగభగలు… ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ. 80 వేలకు చేరడం ఖాయమన్న వార్తలకు ప్రస్తుతం పెరుగుతోన్న బంగారం ధరలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర సుమారు రూ. 75వేలకు చేరువైంది. అయితే సోమవారం బంగారం ధరలో స్వల్పంగా...

Gold Price Today: బంగారం భగభగలు... ఆ మార్క్‌కు చేరువలో తులం పసిడి ధర.
Gold Price
Narender Vaitla
|

Updated on: May 20, 2024 | 6:25 AM

Share

బంగారం ధరలు కాస్త శాంతిస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో మళ్లీ పెరుగుతున్నాయి. తులం బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ. 80 వేలకు చేరడం ఖాయమన్న వార్తలకు ప్రస్తుతం పెరుగుతోన్న బంగారం ధరలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర సుమారు రూ. 75వేలకు చేరువైంది. అయితే సోమవారం బంగారం ధరలో స్వల్పంగా తగ్గుదల కనిపించింది. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,540గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 74,760 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,390కాగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 76,610గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68,490కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 74,720గా ఉంది.

* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ఉంది.

* విజయవాడలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ఉంది.

* విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ రోజు హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,390కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,610గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపైస రూ. 100వరకు తగ్గింది. అయితే పెరిగిన ధరతో పోల్చితే ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. కిలో వెండి ధర ఏకంగా రూ. లక్షకు చేరువకావడం సామాన్యులను భయపెడుతోంది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 92,900గా ఉండగా హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 96,400కి చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..