పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. బంగారంపై పెట్టుబడి పెట్టే వారు మన దేశంలో ఎక్కువ మందే ఉన్నారు. అలాంటి బంగారం ధరలు నిన్న స్వల్పంగా పెరిగినప్పటికీ మళ్ళీ ఈరోజు దిగివచ్చింది. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,230 కాగా ఈరోజు తులంపై రూ.10 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,220 కి చేరింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,000 ఉండగా ఈరోజు తులంపై రూ.10 తగ్గుదల కనిపిస్తోంది. అంటే రూ.57,990 కి చేరింది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్న, మొన్నటి వరకూ కిలో వెండి రూ.76,000 కాగా ఈరోజు కిలోపై రూ. 1000 తగ్గి 75,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..