
ఏదైనా అత్యవసర అవసరం వస్తే చాలా మంది తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు పొందుతుంటారు. ఇతర లోన్ల కంటే బంగారు రుణాలపై తక్కువ వడ్డీ ఉంటుంది. ఎందుకంటే మన బంగారం బ్యాంక్ వద్ద ఉంటుంది కనుక. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో బంగారం తాకట్టు పెడితే కూడా భారీ మొత్తంలో నగదు వస్తుంది. మరి వీటిపై ఏ బ్యాంక్లో ఎంత వడ్డీ రేటు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా పర్సనల్ లోన్స్ బ్యాంకుల్లో 16 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంటారు. అదే సమయంలో బంగారం రుణాల పైన వడ్డీ 10 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. అలాగే ఈ రుణం పొందేందుకు మీకు ఎలాంటి సిబిల్ స్కోర్ అవసరం లేదు. అందుకే బంగారు రుణాలను తీసుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి